దారుణం: ప్రేమజంటపై దాడి.. చచ్చాక చెట్టుకు వేలాడదీసి..
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. బరేలి జిల్లా మీర్గంజ్లో ప్రేమ జంటపై దాడి చేశారు. ఎంతలా అంటే వారిద్దరూ చనిపోయే వరకు వదల్లేదు. చనిపోయిన తర్వాత వారిద్దరినీ వేలాడదీశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. యువకుడి పేరంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసులో పోలీసులు బాలిక మేనమామ, ఆమె సోదరుడిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మీర్ గంజ్ కి చెందిన యువకుడు, యువతి ప్రేమించుకున్నారు. గురువారం వారిద్దరూ మాట్లాడుకుంటుడగా యువతి బంధువులు గమనించారు. దీంతో ఊగిపోయారు.
క్షణికావేశంలో దాడి చేశారు. చనిపోగా.. చెట్టుకు వేలాడదీశారు. విషయం తెలిసిన యువకుడు పేరంట్స్ ఘటనాస్థలానికి వచ్చారు. గుండెలవిసేలా రోదించారు. దాడి గురించి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఎవరెవరి పాత్ర ఉందనే అనుమానంతో ఫిర్యాదు చేశారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. దాడి చేసిన ఇద్దరినీ అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.