Lovers: అక్క మొగుడు, బావా ఫ్లీజ్ వద్దు, నాకు దేవదాసు ఉన్నాడు, రేయ్ నరికేస్తా, పొడిచేస్తా, కట్ చేస్తే
చెన్నై/ తిరుపతి/ వేలూరు: కట్టుకున్న భార్య సొంత చెల్లెలి మీద కన్ను వేసిన బావ ఆమెను వలలో వేసుకోవడానికి ప్రయత్నించాడు. తనకు పెళ్లి జరిగి 10 ఏళ్లు అవుతున్నా పిల్లలు పుట్టలేదని, అందుకు మీ అమ్మాయే కారణం, మీ రెండో కూతురిని తనకు ఇచ్చి పెళ్లి చెయ్యాలని అల్లుడు పట్టుబట్టాడు. బావా వద్దు ఫ్లీజ్ వదిలేయ్, నాకు వేరేవాడు ఉన్నాడు అంటూ మరదులు ఎంత చెప్పినా బావ మాత్రం వినలేదు. నా ప్రియురాలి జోలికి వస్తే బాగుండదని ప్రియుడు, నా మరదలిని మరిచిపోకపోతే నిన్ను లేపేస్తానని బావ ఒకరికి ఒకరు చాలెంజ్ చేసుకున్నారు. అయితే పరిస్థితి ముదిరిపోవడంతో ఒకరి హత్యతో ఈ కథ క్రైమాక్స్ కు చేరింది.
Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!
తిరుపతి అల్లుడు
ఆంధ్రపదేశ్ లోని తిరుపతిలో దురైబాబు అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దులోని (చిత్తూరు జిల్లా సరిహద్దు) వేలూరు జిల్లాలోని గుడియాతం నెక్ట్స్ భరతరామి వీడి. పాలెంలో కుమారస్వామి నివాసం ఉంటున్నారు. కుమారస్వామి పెద్ద కుమార్తె చాముండేశ్వరి, తిరుపతి దురైబాబుల వివాహం 10 ఏళ్ల క్రితం జరిగింది.
తప్పు నాదికాదు... నీ కూతురిదే !
దురైబాబు, చాముండేశ్వరికి 10 ఏళ్ల క్రితం పెళ్లి జరిగినా ఇంత వరకు పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టడానికి దురైబాబు, చాముండేశ్వరి అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఇంతకాలం అయినా పిల్లలు పుట్టకపోవడంతో దురైబాబు. చాముండేశ్వరి ఇళ్లలో పంచాయితీలు జరిగాయి. పిల్లలు పుట్టకపోవడానికి నేను కారణం కాదని, నీ కూతురు చాముండేశ్వరి వలనే పిల్లలు పుట్లలేదని దురైబాబు ఆరోపించాడు.
మరదలిపై బాబు కన్నుపడింది
భార్య చాముండేశ్వరి చెల్లెలు పార్వతి (19) మీద బావ కన్నుపడింది. తాను పార్వతిని పెళ్లి చేసుకుంటానని, అక్కాచెల్లితో కాపుం చేస్తే ఎవరికో ఒకరికి పిల్లలు పుడుతారని దురైబాబు పంచాయితీ పెట్టాడు. ఇదే సమయంలో పార్వతిని అల్లుడు దురైబాబుకు ఇచ్చి రెండో పెళ్లి చెయ్యడానికి ఆమె తండ్రి కుమారస్వామి సిద్దం అయ్యాడు. అయితే దురైబాబును పెళ్లి చేసుకోనని పార్వతి ఎదురుతిరిగింది.
పార్వతికి దేవదాస్ ఉన్నాడు
గుడియాతంకు చెందిన పువరాసన్ అనే యువకుడిని నాలుగు సంవత్సరాల నుంచి పార్వతి ప్రేమిస్తోంది. పూవరాసన్, పార్వతిల కులాలు వేరుకావడంతో వారి పెళ్లికి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కుమారస్వామి అల్లుడు దురైబాబుకు రెండో పెళ్లి చెయ్యాలని నిర్ణించాడు. ఈ విషయంపై కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి.
బావా ఫ్లీజ్ వదిలేయ్...వాడు ఉన్నాడు
బావా తాను పువరాసన్ ను ప్రేమిస్తున్నానని, అతనినే పెళ్లి చేసుకుంటానని, ప్లీజ్ నన్ను వదిలేయ్ అంటూ పార్వతి అక్క మొగుడు దురైబాబును ఇన్ని రోజులు వేడుకుంది. అయితే పార్వతిని రెండో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన దురైబాబు మాట వినకుండా వెళ్లి నా మరదలి జోలికి వస్తే నిన్ను లేపేస్తా, నరికేస్తా అంటూ పువరాసన్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఆసమయంలో నా ప్రియురాలి జోలికి వస్తే నిన్నే చంపేస్తాను అంటూ ప్రియుడు పువరాసన్ సైతం ప్రియురాలి బావ దురైబాబును హెచ్చరించాడు.
Recommended Video
మాట వినలేదని నరికేశారు
తాను మరదలు పార్వతిని పెళ్లి చేసుకోవాలని దురైబాబు పట్టుబట్టాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, మనం పెళ్లి చేసుకోవాలి అంతే అంటూ పార్వతి వెళ్లి ప్రియుడు పువరాసన్ కు చెప్పింది. ఇన్ని రోజులు పగతో రగిలిపోయిన పువరాసన్ పెద్ద కొడవలి తీసుకెళ్లి ప్రియురాలు పార్వతి బావ దురైబాబును నరికేశాడు. విషయం తెలుసుకున్న పార్వతి కేసు నుంచి తప్పించుకోవడానికి ఆసుపత్రిలో చేరింది. కేసు నమోదు చేసిన వేలూరు పోలీసులు విచారణ చేస్తున్నారు.