Lovers: ఎదురింటి అమ్మాయి, నిద్రలేస్తే చూస్తు సైగలు, పెళ్లి చేసుకున్న రోజే ఆత్మహత్య, ఏం జరిగిందంటే ?
బెంగళూరు/విజయపుర: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు అనుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్న ప్రేమికులు చాలా సంతోషంగా తిరిగారు. కుటుంబ సభ్యులు, బంధువులకు మ్యాటర్ లీక్ కాకుండా ప్రేమికులు ఎంజాయ్ చేశారు. ప్రేమికులు పెళ్లి చేసుకుంటారని వారి స్నేహితులు అనుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్న ప్రేమికులు ఒకే తాడుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్య చేసుకునే ముందు ప్రియురాలు ఆమె కోరిక తీర్చుకుని ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ చలించిపోయారు. ప్రేమికులు ఒకేతాడుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
ఒకే ఊరిలో లవర్స్
కర్ణాటకలోని విజయపూర జిల్లాలోని బసవన బాగేవాడి తాలూకా జైనాపూర్ గ్రామంలో రాకేష్ అంబలి అలియాస్ రాకేష్ (23) అనే యువకుడు, సావిత్రి అంబలి అలియాస్ సావిత్రి (19) అనే యవతి నివాసం ఉంటున్నారు. చాలా సంవత్సరాల నుంచి రాకేష్, సావిత్రికి పరిచయం ఉంది. గత మూడు సంవత్సరాల నుంచి రాకేష్, సావిత్రి ప్రేమించుకుంటున్నారు.
ఎదురింటి అమ్మాయి
జైనాపూర్ గ్రామానికి చెందిన రాకేష్, సావిత్రిల ఇళ్లు ఎదురెదురుగా ఉండడంతో ప్రతిరోజూ ఒకరినొకరు చూసుకుంటున్నారు. ప్రేమలో ఉన్న సావిత్రి, రాకేష్ బయట కలుసుకోవాలంటే సైగలు చేసుకుని బయటకు వెళ్లి కలుస్తున్నారు. రాకేష్ టాక్సీ డ్రైవర్. సావిత్రి 9వ తరగతి వరకు చదువుకుంది. తరువాత సావిత్రిని స్కూల్ కు వెళ్లకుండా ఆమె కుటుంబ సభ్యులు ఆమె చదువు ఆపేసి ఇంట్లోనే పెట్టుకున్నారు.
పెళ్లి చేసుకుందామని అనుకుంటే ?
గత మూడు సంవత్సరాల నుంచి రాకేష్, సావిత్రి ప్రేమించుకుంటున్నారు. సావిత్రి ఇంట్లో ఆమె కుటుంబ సభ్యులు లేని సమయంలో ప్రియుడు రాకేష్ ఆమె ఇంటికి వెళ్లి వస్తున్నాడు. ప్రేమికుల విషయం ఇరు వైపుల కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. మేము పెళ్లి చేసుకుంటామని ప్రేమికులు వారి కుటుంబసభ్యుల ముందు పట్టుబట్టారు. ప్రేమికులు సావిత్రి, రాకేష్ ల కులాలు వేరే కావడం ఇరు వైపుల కుటుంబ సభ్యులు వారి పెళ్లిని వ్యతిరేకించారు. పెళ్లి చేసుకోవడానికి వీలులేదని ఇరువైపుల కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు హెచ్చరించారు.
మనసు మార్చిన ఫ్రెండ్స్
పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో ప్రేమికులు రాకేష్, సావిత్రి మనస్తాపం చెందారు. ప్రేమ పెళ్లికి పెద్దలు విలువ ఇవ్వడం లేదని, మనం ఆత్మహత్య చేసుకుందామని కొన్ని రోజుల క్రితం ప్రేమికులు రాకేష్, సావిత్రి మాట్లాడుకున్నారు. అయితే ప్రేమికులను వారి స్నేహితులు నచ్చ చెప్పి కొన్ని రోజులు వేచి చూడాలని మనవి చేశారని తెలిసింది.
ఒకేతాడుకు ఉరి వేసుకున్న ప్రేమికులు
రాకేష్, సావిత్రిల వివాహాన్ని రెండు కుటుంబాలు తిరస్కరించడంతో ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయారు. చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకొని ఉరి దగ్గరకు వెళ్లారు. అయితే రెండు కుటుంబాలు కచ్చితంగా మనల్ని విడదీస్తారని చివరికి నిమిషంలో భయపడ్డారు. చివరికి ఊరి బయట ఉన్న చెట్టుకు ప్రేమికులు సావిత్రి, రాకేష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రియురాలి మెడలో తాళి
ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న విషయం గ్రామస్తులకు తెలిసింది. ఇద్దరి మృతదేహాలను కిందకు దించారు. సావిత్రి మెడపై తాళి ఉండటంతో అందరూ హడలిపోయారు. ఆత్మహత్య చేసుకునే ముందు సావిత్రి ఆమె ప్రియుడు రాకేష్ దగ్గర తాళి కట్టించుకుని ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు. ఇంటి నుంచి పారిపోయిన ప్రేమికులు మరుసటి రోజే ఒకేతాడుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. బసవనబాగేవాడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.