షాక్: ఇక నుండి ప్రతినెల రూ.4 గ్యాస్ ధర పెంపు
వంట గ్యాస్పై మరింత భారం మోపనుంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి నెలా రూ. 4 చొప్పున సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరను పెంచనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ లోక్సభలో ప్రకటించారు
ఢిల్లీ: వంట గ్యాస్పై మరింత భారం మోపనుంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి నెలా రూ. 4 చొప్పున సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరను పెంచనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ లోక్సభలో ప్రకటించారు.
పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ధర్మేంధ్ర ప్రధాన్ ఎంపీలకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. 14.2 కిలోల సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్పై నెలకు రూ.2 చొప్పున పెంచాలని ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం సంస్థకు గత ఏడాదే చెప్పినట్టు ఆయన ఆ సమాధానంలో ప్రస్తావించారు.
అయితే ఈ నిర్ణయాన్ని ఈ ఏడాది రూ.4 లకు పెంచాలని నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి వంట గ్యాస్ పై సబ్సిడీని పూర్తిగా తొలగించాలని భావిస్తున్నట్టు ధర్మేంధ్ర ప్రధాన్ ప్రకటించారు.
ప్రస్తుతం సబ్సీడి కింద ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు తీసుకోవచ్చు. ఆ తర్వాత 13 వ, సిలిండర్ నుండి మార్కెట్ ధరకే విక్రయిస్తున్నారు. గత ఏడాది జూలై 1వ, తేది నుండి సబ్సీడీ సిలిండర్పై ప్రతి నెల రూ పెంచుతున్నారు.