ఇద్దరు మహిళలకు లిఫ్ట్ ఇచ్చి.. కదులుతున్న వాహనంలోనే గ్యాంగ్ రేప్
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఓ దారుణం వెలుగుచూసింది. కారులో వెళుతున్న ఓ వ్యక్తి లిఫ్ట్ ఇస్తానంటూ ఇద్దరు మహిళలను ఎక్కించుకుని, మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కదులుతున్న వాహనంలోనే వారిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఆ మహిళలు ఫరూఖాబాద్ నుంచి కమల్గంజ్కు తిరిగొస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తెలిసిన వ్యక్తే కావడంతో వారు నిస్సంకోచంగా కారులో ఎక్కారు. ఆ తరువాత కొంతదూరం వెళ్లాక ఆ కారులో మరో ఇద్దరు వ్యక్తులు ఎక్కారని, అందరూ కలిసి వీరిపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారని తెలుస్తోంది.
ఈ దారుణం అనంతరం బాధిత మహిళలు ఓ దాబాకు వచ్చి తలదాచుకున్నట్లు కన్నూజ్ ఎస్పీ శేఖర్ చంద్ర గోస్వామి పేర్కొన్నారు. సదరు దాబా యజమాని ఆ మహిళలను పోలీసు స్టేషన్కు తీసుకొచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత మహిళలకు కౌన్సెలింగ్ నిర్వహించి వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.