వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్‌లో దారుణం: నడిరోడ్డుపై మహిళను గొడ్డలితో నరికి.. సెల్ఫీ వీడియో!

రోడ్డుపై ఆమె నడుచుకుంటున్న వెళ్తున్న సమయంలో విచక్షణారహితంగా గొడ్డలితో దాడి చేసి నరికిచంపాడు. హత్య తర్వాత రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాంతో సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు.

|
Google Oneindia TeluguNews

లూథియానా: తన అక్రమ సంబంధాన్ని ఎక్కడ బయటపెడుతుందో అన్న అనుమానంతో ఓ మహిళను నడిరోడ్డుపై అతిదారుణంగా గొడ్డలితో నరికి చంపాడో వ్యక్తి. పంజాబ్‌లోని లూధియానాలో ఈ దారుణం జరిగింది. హత్యానంతరం మహిళ మృతదేహం పక్కనే నిందితుడు సెల్ఫీ వీడియో దిగడం గమనార్హం.

కిలా రాయ్‌పూర్ గ్రామంలో ఆదివారం నాడు ఈ ఘటన చోటు చేసుకోగా.. హత్య చేసిన తర్వాత నిందితుడే స్వయంగా పోలీసులకు సమాచారం అందించాడు. వివరాల్లోకి వెళ్తే.. కిలా రాయ్ పూర్ గ్రామంలోని ఓ మహిళతో మనీందర్ సింగ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. గత కొన్నాళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారం వేరే మహిళ కంటపడింది. అప్పటినుంచి మనిందర్‌సింగ్‌ను ఆమె బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది.

 Ludhiana man axes 40-yr-old woman to death, informs cops after filming crime scene

పదేపదే బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతుండటంతో.. మనిందర్ సింగ్ సహించలేకపోయాడు. ఆమెను హత్య చేయడమే ఇందుకు పరిష్కారమని నిర్దారించుకుని.. రోడ్డుపై ఆమె నడుచుకుంటున్న వెళ్తున్న సమయంలో విచక్షణారహితంగా గొడ్డలితో దాడి చేసి నరికిచంపాడు. హత్య తర్వాత రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాంతో సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. అనంతరం తానే స్వయంగా పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

English summary
A 40-year-old woman was axed to death in broad day light at village Kila Raipur, about 30 km from Ludhiana, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X