లూథియానా: స్వీప్ చేసిన కాంగ్రెసు, బిజెపి కూటమి బేజారు
లూథియానా: పంజాబ్లోని లూథియానా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెసు విజయ ఢంకా మోగించింది. బిజెపి, శిరోమణి అకాలీదళ్ కూటమి కంగు తిన్నది. లూథియానాలోని 95 వార్డుల్లో కాంగ్రెసు 62 వార్డులను గెలుచుకుంది.
శిరోమణి అకాలీదళ్, బిజెపి కూటమి 21 వార్డులకే పరిమితమైంది. శిరోమణి అకాలీదళ్ 11 వార్డులను, బిజెపి 10 వార్డులను గెలుచుకున్నాయి. ఎల్పీ, ఏఏపి కూటమి 8 వార్డుల్లో విజయం సాధించింది. నాలుగు వార్డుల్లో స్వతంత్రులు గెలిచారు. అతి పెద్ద మునిసిపాలిటీ అయిన లూథియానాలో పాగా వేసేందుకుకాంగ్రెసు తీవ్ర ప్రయత్నమే చేసింది.
అమృతసర్, పాటియాలా, జలంధర్ మున్సిపల్ కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగిన రెండు నెలల తర్వాత లూథియానాలో ఎన్నికలు జరిగాయి. కెప్టెన్ అమరిందర్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెసు పార్టీ అమృతసర్, పాటియాలా, జలంధర్ ఎన్నికల్లో కూడా కాంగ్రెసు విజయం సాధించింది.
లూథియానా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉయం ప్రారంభమైంది. ఉదయం 11 గంటల సమయానికే కాగ్రెసు స్పష్టమైన ఆధిక్యతను సాధించింది.