జయలలిత పోయస్ గార్డెన్ : రూ. 100 కోట్లు గుర్తుందా, పళని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు !
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంను అమ్మ స్మారక భవనం చెయ్యాలని మీరు ఎలా నిర్ణయం తీసుకున్నారు ?
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంను అమ్మ స్మారక భవనం చెయ్యాలని మీరు ఎలా నిర్ణయం తీసుకున్నారు ? అని సమాధానం చెప్పాలని మద్రాసు హైకోర్టు మంగళవారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
సుప్రీం కోర్టులో చివాట్లు తిన్న టీటీవీ దినకరన్: మరో సారి వస్తే రూ. 10 లక్షలు ఫైన్ !
పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంను జయలలిత స్మారక భవనం చెయ్యాలని మీరు ఎందుకు ఆదేశాలు జారీ చేశారు చెప్పాలని తమిళనాడులోని పళనిసామి ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు సూచించింది. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కోర్టు రూ. 100 కోట్ల అపరాద రుసుం విధించిన విషయం తెలిసిందే.
జయలలిత ఆస్తులు విక్రయించి రూ. 100 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలని గతంలోనే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో జయలలిత ఆస్తులు వేలం వెయ్యాలని కోర్టు చెప్పినా ఆమెకు చెందిన ఆస్తుల్లోని వేదనిలయం ఎలా స్మారక భనం చేస్తారని తమిళనాడులోని ముసురు ప్రాంతానికి చెందిన తంగవేలు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సీఎం పళని, పన్నీర్ పక్కా ప్లాన్: దినకరన్ క్యాంప్ ఎమ్మెల్యేలు జంప్, బెంగళూరు రిసార్ట్ కు !
ఆదాయానికి మంచిన అక్రమాస్తుల కేసులో జయలలిత ఆస్తులు విక్రయించి ప్రభుత్వ ఖాతాలో రూ. 100 కోట్లు డిపాజిట్ చేసిన తరువాత పోయెస్ గార్డెన్ ను అమ్మ స్మారక భవనంగా ఏర్పాటు చెయ్యాలని తంగవేలు మద్రాసు హైకోర్టులో మనవి చేశారు. మంగళవారం అర్జీ విచారించిన మద్రాసు హై కోర్టు వేదనిలయం విషయంలో సమాధానం చెప్పాలని తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.