కరెన్సీపై మహాత్మ వద్దనందుకు రూ. 10 వేలు ఫైన్: తమాషాగా ఉందా, హై కోర్టు సీరియస్ !
భారత కరెన్సీ మీద గాంధీ ముందు మహాత్మ పేరుసవాల్ చేస్తూ మద్రాసు హై కోర్టులో పిటిషన్ వేశాడు, మండిపడిన కోర్టున్యాయస్థానం సమయాన్ని వృధా చేస్తావా, రూ. 10 వేలు జరిమానా చెల్లించు
బెంగళూరు: భారత కరెన్సీ నోట్ల మీద గాంధీ ముందు మహాత్మ అనే పదాన్ని వాడటాన్ని నిషేధించాలని కోరూతూ దాఖలైన పిటిషన్ పై మద్రాస్ హై కోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. కోర్టులు అంటే తమాషాగా ఉందా, న్యాయస్థానం సమయాన్ని వృధా చేస్తావా అంటూ పిటిషనర్ పై న్యాయమూర్తులు మండిపడ్డారు.
ఇలాంటి పిటిషన్ దాఖలు చేసినందుకు రూ. 10 వేలు అపరాధ రుసుం చెల్లించాలని పిటిషనర్ కు మద్రాసు హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోల్ కతాలోని జాదవ్ పూర్ వర్శిటీలో రీసెర్స్ స్కాలర్ గా ఉన్న మురుగనాథమ్ భారత కరెన్సీ మీద గాంధీ పేరు ముందు మహాత్మ అని వాడటం రాజ్యంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ మద్రాసు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి ఎం. సుందర్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ పిటిషన్ విచారణ చేసింది. ఆర్ బీఐ మహాత్మ అనే పదం వాడటం రాజ్యాంగ మౌలిక సూత్రమైన సమానత్వానికి విరుద్దమని పిటిషనర్ పేర్కొన్నారు.
ఈ పిటిషన్ విచారార్హమైనది కాదని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఎం. సుందర్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లు వేసి మరో సారి కోర్టు సమయాన్ని వృధా చెయ్యకూడదని పిటిషనర్ ను హెచ్చరించింది. కోర్టు సమయాన్ని వృధా చేసిందుకు మురుగనాథన్ కు మద్రాసు హై కోర్టు రూ. 10 వేలు జరిమానా విధించింది.