వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భివండిలో కుప్పకూలిన భవనం: శిథిలాల కింద 8మంది
థానే: మహారాష్ట్ర రాజధాని ముంబై సమీపంలోని భివండి ప్రాంతంలో రెండంతస్థుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో స్థానిక కళ్యాణ్ రోడ్డులోని రెండు అంతస్థులభవనం ఒక్కసారిగా కుప్పకూలింది.
థానే మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ నలుగురిని శిథిలాల నుంచి బయటికి వెలికితీశారు.
మరో ఎనిమిది మంది రాళ్ల మధ్య చిక్కుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత ఆదివారం భివండి ప్రాంతంలోనే రెండు అంతస్థుల భవనం కూలి 9మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Comments
English summary
A two-storey building collapsed in the powerloom town of Bhiwandi on Sunday with rescue workers pulling out four persons from the debris while some persons are feared trapped, officials said.
Story first published: Sunday, August 7, 2016, 11:18 [IST]