మహారాష్ట్ర అసెంబ్లీలో హైలైట్స్:169 మంది ఎమ్మెల్యేల మద్దతు:విశ్వాస పరీక్ష నెగ్గిన ఉద్ధవ్ ప్రభుత్వం
ముంబై:మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర వికాస్ అఘాడీ ప్రభుత్వం రెండు నెలల ప్రతిష్టంభన తర్వాత ఏర్పాటు అయ్యింది. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీలతో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం మహారాష్ట్రలో ఏర్పాటు అయ్యింది. ఇక సీఎంగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేశారు. శనివారం మధ్యాహ్నం జరిగిన విశ్వాస పరీక్షలో ఉధ్దవ్ థాక్రే ప్రభుత్వం విజయం సాధించింది. ఉద్ధవ్కు మద్దతుగా 169 మంది ఎమ్మెల్యేలు నిలిచారు. ఇక సభలో ప్రొటెం స్పీకర్ వ్యవహారంపై గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. సభలో బీజేపీ సభ్యులు లేకుండానే బలనిరూపణ కార్యక్రమం నిర్వహించారు ప్రొటెం స్పీకర్.
అంతకుముందు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని అర్థరాత్రి 1గంటలకు సమన్లు ఇవ్వడమేంటంటూ సభలో బీజేపీ నేత ఫడ్నవీస్ ప్రశ్నించారు. సభ అసెంబ్లీ నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకారం కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగాయని మండిపడ్డారు. బలపరీక్షలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం విజయం సాధించిందని ప్రొటెం స్పీకర్ దిలీప్ డిక్లేర్ చేసి సభను ఆదివారంకు వాయిదా వేశారు. ఇక శనివారం సభలో జరిగిన అన్ని అంశాలు మినిట్ టూ మినిట్ అప్డేట్స్ హైలైట్స్ మీకోసం