చెప్పులు మోయించిన మహిళా మంత్రి(ఫొటో)
ముంబై: మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండే మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె దగ్గర పనిచేసే సిబ్బందిలో ఒకరు... పంకజ చెప్పులు మోయడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. రాష్ట్రంలో కరవు సంభవించిన పర్భానీ జిల్లా సొన్ పెత్ ప్రాంతాన్ని బుధవారం ఆమె సందర్శించారు.
Zoom
i
m
barefeet
bcoz
chappal
got
stuck
in
the
mud
i
walked
from
up
till
down
without
footwear
pic.twitter.com/rWXXyWZ0xj
—
PankajaGopinathMunde
(@Pankajamunde)
August
12,
2015
ఆ సందర్భంగా పంకజ ముండే అక్కడ చెప్పులతో నడవడానికి కష్టంగా ఉందని వాటిని విడిచి ఒట్టి కాళ్లతోనే నడక సాగించారు. అనంతరం మంత్రి విడిచిన చెప్పులు ఓ సిబ్బంది చేతుల్లో పట్టుకుని మోశారు. ఈ విషయాన్ని పలు టీవీ ఛానల్స్ ఫోకస్ చేశాయి.
కాగా, దీనిపై ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఈ విషయంపై మంత్రిని వివరణ కోరగా.. ‘మీరు నా సిబ్బంది చెప్పులు మోయడమే చూశారు.. కానీ నా పాదాలకు అంటిన బురదను చూడలేక పోయారని, చెప్పులు లేకుండానే ఆ ప్రాంతంలో నడక సాగించాల్సి వచ్చింది' అని పేర్కొన్నారు.
Plz
b
sensitive
dan
sensational
from
8am
to
10pm
im
still
going
n
visiting
poor
draught
affected
farmers
resolving
dis
is
imp
not
chappals
—
PankajaGopinathMunde
(@Pankajamunde)
August
12,
2015
‘చెప్పుల గురించి కంటే, ముఖ్యమైన విషయం కరవు వల్ల దెబ్బతిన్న రైతుల సమస్య' అని పేర్కొంటూనే, 'ఆ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి కాదు.. నా వ్యక్తిగత సిబ్బంది' అని మంత్రి పంజక వివరణ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ అధికార ప్రతినిధి అల్ నస్సీర్ జకారియా మాత్రం.. ఈ ఘటన మంత్రి వ్యక్తిత్వాన్ని వెల్లడి చేసిందని, ఓ పేదవాడితో చెప్పులు మోపించిన వ్యక్తి రైతులకు, సాధారణ పౌరులకు ఏం సేవ చేస్తారని విమర్శించారు.