మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 4 వేల పాజిటివ్ కేసులు
మహారాష్ట్రలో మరోసారి కరోనా వైరస్ వేవ్ కొనసాగుతోతుంది. గత 24 గంటల్లో 4 వేల పాజిటివ్ కేసులు నమోదు అవగా.. ఒక్క రోజులోనే 40 మంది మరణించారు. వీటితో ఇప్పటి వరకు మహారాష్ట్రలో వైరస్ సోకిన వారి సంఖ్య 20లక్షల 64వేల 278కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 51వేల 529కి చేరుకుందనిసెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
ఆదివారం ఒక్క రోజులో 1355 మంది రోగులను డిశ్చార్జ్ చేశారు. రికవరీ కేసుల సంఖ్య 19లక్షల 75వేల 603కి చేరినా.. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 35వేల 965 పాజిటివ్ కేసులు ఉండటంతో ప్రజలు భయంతో బతికేస్తున్నారు. లక్షా 75 వేల మంది హోమ్ క్వారెంటైన్లో ఉన్నారు. మరో 1747 మంది ఇన్స్టిట్యూషనల్ క్వారెంటైన్లో ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో కోవిడ్ రికవరీ రేటు 95.7 శాతంగా ఉండగా మరణాల రేటు 2.5 శాతంగా ఉంది.
ఆదివారం 48 వల 782 మందికి కరోనా పరీక్షలు చేశారు. ముంబైలో 645 మందికి వైరస్ వచ్చింది. నాసిక్లో 122, పుణెలో 353, బించ్ వాడలో 138 కేసులు ఉన్నాయి. ఔరంగబాద్, హింగోలిలో కొత్తగా కరోనా వైరస్ కేసులు రాలేదు. కొల్హాపూర్లో గల రత్నగిరి డివిజన్లో ఒకరు మరణించారు. మహారాష్ట్రలో గల అమరావతిల 430 కేసులు వచ్చాయి.