వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టాలు తప్పిన హౌరా మెయిల్ మూడు బోగీలు: అప్రమత్తతో తప్పిన ప్రమాదం

|
Google Oneindia TeluguNews

నాసిక్‌: ఆదివారం తెల్లవారుజామున ముంబై-హౌరా మధ్య ప్రయాణించే రైలు పట్టాలు తప్పింది. మహారాష్ట్రలోని నాసిక్‌ వద్ద రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఎలాంటి సమాచారం అందలేదు.

ముంబై నుంచి హౌరాకు(12809) నాగ్‌పూర్‌ మీదుగా వెళ్లే ఈ రైలు బయల్దేరిన కొద్దిసేపటికే ఇగత్‌పురి వద్దకు రాగానే ఎస్‌-12,ఎస్‌-13, ప్యాంట్రీ కార్‌ బోగీలు పట్టాలు తప్పాయని రైల్వే అధికారులు తెలిపారు. భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందనుకుంటున్నామని చెప్పారు.

Maharashtra: Three coaches of Howrah Mail derail

వెంటనే అప్రమత్తం అవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. మరమ్మతు చర్యలు ప్రారంభించామని, ఈ ఘటలో ఇప్పటివరకూ ఎవరికీ ప్రాణహాని జరగలేదని చెప్పారు.

ఘటనపై మరిన్ని వివరాలు తర్వాత వెల్లడిస్తామ అని రైల్వే అధికారి తెలిపారు. కాగా, ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో ప్రయాణించే 12 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.

English summary
Three coaches of the 12840 Howrah Mail train have derailed in Maharashtra. The incident took place in the wee hours of Sunday near the Igatpuri railway station in Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X