వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం : కన్న కూతురిని హత్యచేసిన తల్లి..

|
Google Oneindia TeluguNews

పూనే : మహారాష్ట్రలో దారుణం జరిగింది. కూతురి ప్రవర్తనతో విసుగు చెందిన తల్లి ఆమెను రాయితో కొట్టి చంపేసింది. పూనేలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. సంజీవని బొబాటే అనే మహిళ భర్త, కూతురు రితుజాతో కలిసి బారామతి సిటీలోని ప్రగతి నగర్‌లో నివసిస్తోంది. కొన్నాళ్ల క్రితం రితుజా తల్లిదండ్రులను ఎదురించి కులాంతర వివాహం చేసుకుంది. అయితే రెండు నెలలు గడవక ముందే భర్తతో గొడవపడి తల్లి వద్దకు చేరింది.

<strong>వీడు మనిషి కాదు..మృగం: భార్యపై ప్లాస్టిక్ హ్యాండిల్‌ గ్రిప్‌తో అక్కడ దాడి చేశాడు</strong>వీడు మనిషి కాదు..మృగం: భార్యపై ప్లాస్టిక్ హ్యాండిల్‌ గ్రిప్‌తో అక్కడ దాడి చేశాడు

కూతురి కాపురం చక్కదిద్దేందుకు సంజీవని చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినా రితుజా అంగీకరించలేదు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతనిపై అత్యాచారం కేసు పెట్టిడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆమె తల్లిదండ్రులు రితుజాను ఒప్పించి కేసు వాపసు తీసుకునేలా చేశారు. అల్లుడిని బతిమాలి కూతురిని కాపురానికి తీసుకెళ్లాల్సిందిగా కోరారు.

Maharashtra woman kills 19-year-old daughter with heavy stone

రితుజా తనను అరెస్ట్ చేయించడంపై ఆగ్రహంతో ఉన్న ఆమె భర్త ఆమెను తీసుకెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో చేసేదేంలేక ఊరుకున్నారు. అయితే ఇంతకాలం భర్త వద్దకు వెళ్లేందుకు నిరాకరించిన రితూజా మంగళవారం తనను మెట్టినింటికి పంపాలని తల్లితో గొడవపడింది. ఈ పరిణామాలన్నింటితో కూతురి ప్రవర్తనతో విసిగిపోయిన సంజీవని, ఆమెపై దాడి చేసింది. తలపై బండరాయితో మోదడంతో రితుజా అక్కడికక్కడి చనిపోయింది. స్థానికులిచ్చిన సమాచారంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు సంజీవనిని అరెస్ట్ చేశారు.

English summary
A woman allegedly killed her 19- year-old daughter in Pune district of Maharashtra on Tuesday after being frustrated over constant fights and arguments with her over domestic issues, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X