వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో గాంధీ విగ్రహం ధ్వంసం: తమిళనాడులో అంబేడ్కర్ విగ్రహానికి అవమానం..

|
Google Oneindia TeluguNews

Recommended Video

Statue vandalisation row: BR Ambedkar, Mahatma Gandhi statues damaged

తిరువనంతపురం: త్రిపురలో 'లెనిన్' విగ్రహంతో మొదలైన విగ్రహాల కూల్చివేతకు తెరపడటం లేదు. తమిళనాడులో పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేసి గంటలు గడవకముందే.. కేరళలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

'పెరియార్'నూ వదలని బీజేపీ?: తమిళనాడులో ఉద్రిక్తత.. భగ్గుమన్న స్టాలిన్..'పెరియార్'నూ వదలని బీజేపీ?: తమిళనాడులో ఉద్రిక్తత.. భగ్గుమన్న స్టాలిన్..

కేరళ కన్నూరు జిల్లాలోని తలైపెరంబులో బుధవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. గాంధీ కళ్లజోడుతో పాటు, మెడలోని దండను వారు ధ్వంసం చేసినట్టు చేసినట్టు తెలుస్తోంది.

Mahatma Gandhi’s Statue Vandalised In Kerala's Kannur

అయితే ఈ విగ్రహం ధ్వంసం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని తాము భావించడం లేదని, దీన్ని మరో కోణంలో చూడాలని పోలీసులు పేర్కొనడం గమనార్హం.

ఇదిలా ఉంటే, తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని తిరుఒట్టియూరులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు అవమానించారు. విగ్రహంపై ఎర్ర రంగు పోసి పారిపోయారు. గత రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది.

కాగా, గడిచిన 60గంటల్లో ఐదు రాష్ట్రాల్లో దాదాపు 6విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. ఇందులో లెనిన్, అంబేడ్కర్, శ్యాంప్రసాద్ ముఖర్జీ,గాంధీ,పెరియార్ ల విగ్రహాలు ఉన్నాయి.

English summary
After destruction of statues of Lenin, Periyar, Dr Babasaheb Ambedkar and Syama Prasad Mukherjee, now a statue of Mahatma Gandhi has been damaged by a local in Kannur, Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X