వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వద్దు: మహాత్మా గాంధీపై అరుంధతి సంచలన వ్యాఖ్యలు
తిరువనంతపురం: జాతిపిత మహాత్మా గాంధీ పైన బుకర్ ప్రైజ్ విజేత, ప్రముఖ రచయిత అరుంధతీ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీజీ కులతత్వ భావాలు ప్రదర్శించారని, జాతిపితగా ఆయన అనర్హుడని, ఆ హోదాకు మరొకరిని ఎంచుకోవాలని ఆమె పేర్కొన్నారు.
ఆయన పేరుతో ఉన్న విశ్వవిద్యాలయాలకు, సంస్థలకు పునఃనామకరణం చేయాలని డిమాండ్ చేశారు. కేరళ యూనివర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
1936లో గాంధీ రాసిన 'ద ఐడియల్ భంగీ' వ్యాసంలో మలమూత్రాదులను పారవేయకుండా, ఎరువుగా మార్చుకోవాలని పాకీ పని వారికి సూచించారని అరుంధతి చెప్పారు. గాంధీకి హరిజనులపై ఎంత ప్రేమ ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. అలాంటి భావాలే నేటి కులాధిపత్య ధోరణులకు బీజం వేశాయని ఆమె విమర్శించారు.
Comments
English summary
Arundhati Roy, who has criticized Mahatma Gandhi for his "casteist tendencies" in the past, on Thursday went a step further saying it was time institutions named after the Father of the Nation were renamed.
Story first published: Friday, July 18, 2014, 10:00 [IST]