మెరినా ఫర్ కరుణానిధి: రజనీ-రాహుల్ డిమాండ్, మోడీతో స్టాలిన్ రెడీ!
చెన్నై: కరుణానిధి అంత్యక్రియలకు మెరీనా బీచ్లో తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై డీఎంకే కేడర్ మండిపడుతోంది. డీఎంకే హింసకు దిగుతోందని తెలుస్తోంది. మరోవైపు, మెరీనాలో అవకాశం ఇవ్వకపోవడంపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు.
కరుణానిధికి మెరీనా బీచ్లో అంత్యక్రియలకు అనుమతి ఇవ్వకపోవడంపై సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా స్పందించారు. గొప్ప నాయకుడికి గౌరవం ఇవ్వాలని తాను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నానని చెప్పారు. మెరీనా బీచ్ వద్ద కరుణ అంత్యక్రియలకు అనుమతి ఇవ్వాలన్నారు. అన్నాదొరై సమాధి వద్దే అంత్యక్రియలకు అనుమతివ్వాలన్నారు. మెరీనా బీచ్లో అంత్యక్రియలు జరిగేలా చూడాలని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
మరోవైపు, కరుణానిధి అంత్యక్రియల స్థలంపై మద్రాస్ హైకోర్టులో విచారణ ప్రారంభిమైంది. డీఎంకే పిటిషన్ పైన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఇదిలా ఉండగా కరుణానిధి మృతి నేపథ్యంలో రేపు (బుధవారం) భారత ప్రభుత్వం సంతాపదినంగా ప్రకటించింది.
Tamil Nadu Government must take all measures, for last rites of #Karunanidhi to be performed near Anna memorial. This would be the highest respect we would be paying to him. This is my humble request: Rajinikanth (file pic) pic.twitter.com/zY8dCQLriT
— ANI (@ANI) August 7, 2018