నేడు తెలంగాణ, కోస్తాలో మోస్తరు వర్షాలు
హైదరాబాద్ : ఎండ వేడితో అల్లాడుతున్న తెలుగు రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణ, కోస్తాంధ్రలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో 3.1కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శ్రీలంకకు ఆగ్నేయంగా దక్షిణ మధ్య బంగాళాఖాతంలో గురువారం నాటికి అల్పపీడనం ఏర్పడనుంది. అది రానున్న 36గంటల్లో బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
వాయుగుండా వాయువ్యంగా పయనించి తుఫాన్గా బలపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇది దక్షిణ తమిళనాడు తీరం దిశగా కదులుతుందని అంటున్నారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలంగాణ, కోస్తా ప్రాంతంలో ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని చెప్పింది.
ఏర్పడిన కారణంగా హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో శ్రీలంకకు ఆగ్నేయ దిశగా గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తదుపరి 36 గంటల్లో ఇది వాయుగుండంగా మారి శ్రీలంక తూర్పుతీర ప్రాంత వెంబడి వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపునకు ప్రయాణించి, ఆ తదుపరి 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది.