భారత్లోకి అక్రమంగా చొరబడ్డ మాజీ మాల్దీవులు ఉపాధ్యక్షుడు, అదుపులోకి తీసుకున్న పోలీసులు
న్యూఢిల్లీ : మాజీ మాల్దీవులు ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ను అదుపులోకి తీసుకొన్నారు. భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డారనే కారణంతో అరెస్ట్ చేసినట్టు కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. తమిళనాడు రాష్ట్రంలోని ట్యుటికోరన్ వద్ద అదీబ్ను భద్రతా సిబ్బంది కస్టడీలోకి తీసుకున్నారని హోంశాఖ అధికారులు కాసేపటి క్రితం తెలియజేశాయి.
ఓ బోటు ద్వారా భారతదేశంలోకి ప్రవేశించేందుకు అదీబ్ ప్రయత్నించారని అభియోగం మోపారు. ఈ మేరకు మాల్దీవులు ఇండిపెండెంట్ రిపోర్ట్ పేర్కొన్నది. ట్యుటికోరన్ పోర్టు గుండా అదీబ్ భారతదేశంలోని అక్రమగా చొరబడేందుకు ప్రయత్నించారని అధికారులు పేర్కొన్నారు. అదీబ్ ఇటీవలే జైలునుంచి విడుదలయ్యారు. మాల్దీవుల్లో ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ అధికారంలోకి వచ్చాక అదీబ్ను జైలులో వేశారు. దీంతో ఆయన తప్పించుకొని .. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విదేశాలకు కూడా అదీబ్ గురించి సమాచారం అందజేశారు. దీంతో భారత్ భూభాగం ట్యూటికోరన్ వద్ద నుంచి చొరబడేందుకు ప్రయత్నించిన అదీబ్ను భారత అధికారులు అదుపులోకి తీసుకున్నారు.