వర్షాలు: వరదనీటిలో ఉజ్జయినీ ఆలయం(పిక్చర్స్)
ఇండోర్: నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం, తుఫాన్ ప్రభావం కారణంగా, అటు ఉత్తర భారతం, ఇటు మధ్య పశ్చిమ రాష్ర్టాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళతోపాటు ఉత్తర భారతాన అధిక వర్షపాతం నమోదవుతోంది.
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, పశ్చిమ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో రాష్ట్రంలోని అనేక నదులు పొంగి పొర్లుతున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రసరణ ప్రభావంతో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ర్టాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఢిల్లీలో శనివారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పశ్చిమ మధ్యప్రదేశ్లో అల్పపీడనం, పంజాబ్పై తుఫాన్ ప్రసరణ ప్రభావంతో వర్షాల తీవ్రత పెరిగిందని స్కైమెట్ తెలిపింది.
ఉజ్జయినీ ఆలయం
నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం, తుఫాన్ ప్రభావం కారణంగా, అటు ఉత్తర భారతం, ఇటు మధ్య పశ్చిమ రాష్ర్టాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఉజ్జయినీ ఆలయం
నైరుతి రుతుపవనాల ప్రభావంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళతోపాటు ఉత్తర భారతాన అధిక వర్షపాతం నమోదవుతోంది.
ఉజ్జయినీ ఆలయం
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, పశ్చిమ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
నీటమునిగిన రైలు పట్టాలు
మధ్యప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో రాష్ట్రంలోని అనేక నదులు పొంగి పొర్లుతున్నాయి.
రైల్వేస్టేషన్లో వరద నీరు
భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని ముంబైలోని ఓ రైల్వే స్టేషన్లోకి చేరిన వరద నీరు.