వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శవ రాజకీయం -మోదీ సంచలనం -టీఎంసీ తుక్కురేగింది -దీదీనే అడ్డుగోడ -మమత ఆడియో లీక్

|
Google Oneindia TeluguNews

కరోనా విలయంతో పోటీ పడుతూ పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సంగ్రామం సాగుతున్నది. శనివారం ఐదో దశ పోలింగ్ జరగ్గా, మిగిలిన మూడు దశల ఎన్నికల కోసం భారీ ఎత్తున ప్రచారమూ కొనసాగింది. కోల్ కతా తర్వాత బెంగాల్ లో అతిపెద్ద నగరమైన అసన్‌సోల్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. కూచ్ బెహార్ లో నలుగురు పౌరుల్ని కేంద్ర బలగాలు కాల్చిచంపిన ఘటనను ప్రస్తావిస్తూ, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ శవ రాజకీయాలను అలవాటేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు, లీకైన ఆడియో క్లిప్పులపై సీఐడీతో దర్యాప్తు చేయిస్తామని సీఎం అన్నారు. వివకాల్లోకి వెళితే..

జగన్‌పై అమిత్ షా యాక్షన్ -విదేశీ పర్యటనలు రద్దు -పవన్ చెప్పింది చేస్తా -తిరుపతిలో రీపోల్: ఎంపీ రఘురామజగన్‌పై అమిత్ షా యాక్షన్ -విదేశీ పర్యటనలు రద్దు -పవన్ చెప్పింది చేస్తా -తిరుపతిలో రీపోల్: ఎంపీ రఘురామ

కక్ష సాధింపులకు హద్దు లేదా..

కక్ష సాధింపులకు హద్దు లేదా..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కక్ష సాధింపు రాజకీయాలు హద్దులు దాటాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. దీదీ రాజకీయాలు నిరసనల పరిధిదాటి కక్ష సాధింపులో ప్రమాదకర స్థాయినీ మించాయన్నారు. తొలి నాలుగు విడతల్లో జనం బీజేపీకి పట్టం కట్టారని, శనివారం నాటి ఐదో విడత పోలింగ్ లోనూ ఓటర్లు కమలం గుర్తుపైనే మీట నొక్కారని, మే 2 తర్వాత బెంగాల్ కు టీఎంసీ పీడ విరగడవుతుందన్నారు.

కొవిడ్ వ్యాక్సిన్ల కొరత: సంచలన ట్విస్ట్ -జో బైడెన్‌కు సీరం సీఈవో ట్వీట్ -నిలదీత -మోదీ సర్కార్ ఏం చేస్తోంది? కొవిడ్ వ్యాక్సిన్ల కొరత: సంచలన ట్విస్ట్ -జో బైడెన్‌కు సీరం సీఈవో ట్వీట్ -నిలదీత -మోదీ సర్కార్ ఏం చేస్తోంది?

శవరాజకీయాలు అలవాటే..

శవరాజకీయాలు అలవాటే..


''ఇప్పటికే ముగిసిన నాలుగు దశల ఎన్నికల్లో టీఎంసీ తునాతునకలైపోయింది. ఐదో దశలోనూ కమలం వికసించింది. ఇక మిగిలిన మూడు దశల పోలింగ్‌లో దీదీ-భైపో (మమత బెనర్జీ, ఆమె మేనల్లుడు) పూర్తిగా తుడిచిపెట్టుకుపోతారు. ఓటమి ఖరారైంది కాబట్టే, దీదీ తను బాగా అలవాటైన శవరాజకీయాలను చేస్తున్నారు. కూచ్ బెహార్ లో (సీఐఎస్ఎఫ్ కాల్పుల్లో) దురదృష్టవశాత్తూ చనిపోయిన వ్యక్తుల శవాలను అడ్డం పెట్టుకుని మమత చీప్ ట్రిక్స్ ప్లే చేద్దామనుకున్నారు. బెంగాల్ అభివృద్ధి బాటలో ఓ పెద్ద గోడ మాదిరిగా మమత బెనర్జీ అడ్డుగా నిల్చున్నారు. ఆ గోడను కూలగొట్టాలని జనం ఇప్పటికే తీర్పు చెప్పారు'' అని ప్రధాని మోదీ అన్నారు. కాగా,

మమత ఆడియో లీక్.. కలకలం

మమత ఆడియో లీక్.. కలకలం

ఎన్నికల వేళ టీఎంసీకి సంబంధించి మరో ఆడియో క్లిప్ లీకైంది. గత వారం స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిశోర్ టేపుల మాదిరే, ఈసారి సీఎం మమత బెనర్జీ, కూచ్ షీతల్ (కూచ్ బెహార్) జిల్లా టీఎంసీ అధ్యక్షుడు ప్రధాన్ ప్రతిమ్ రాయ్ మధ్య జరిగిన సభాషణ బహిర్గతమైంది. కూచ్ బెహార్ లో కేంద్ర బలగాల చేతిలో చనిపోయిన నలుగురు వ్యక్తుల మృతదేహాలతో ర్యాలీ చేపడదామంటూ మమత సూచనలివ్వడం ఆ ఆడియోలో వినిపించింది. కాగా, తన ఫోన్ ను బీజేపీ వాళ్లు ట్యాప్ చేస్తున్నారని సీఎం మమత ఎదురుదాడికి దిగారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఐడీతో దర్యాప్తు చేయిస్తానన్నారు. ఎన్నికల్లో జనమంతా టీఎంసీ వైపు ఉండటంతో బీజేపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని మమత మండిపడ్డారు.

English summary
amid Minister Mamata Banerjee Audio Clip Row, speaking at Asansol rally on saturday Prime Minister Narendra Modi Saturday claimed that the TMC has been broken in the first four phases of elections and accused that mamata has an old habit of doing politics with dead bodies and has been trying to politicise the “unfortunate” death of five people at Sitalkuchi in Cooch Behar district on April 10. Mamata Banerjee Accuses BJP Of Tapping Her Phone, Says Will Conduct CID Probe
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X