రాజ్యంగ స్పూర్తి.... నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారానికి హజరు అవుతా... ! మమతా బెనర్జీ
ఇద్దరు నేతల మధ్య రాజకీయ వైరం ఉన్నా, వాటిని పక్కన బెట్టి ఈ నెల ముప్పైన జరగనున్న మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హజరవుతానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. రాజ్యంగబద్దమైన పదవి స్వీకారం కావడతో ప్రమాణాస్వీకారానికి హజరవుతున్నట్టు ఆమే తెలిపారు. ఇక ఇతర రాష్ట్ర్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతున్నట్టు ఆమే ప్రకటించారు.
రాజ్యంగా స్పూర్తిని తీసుకున్న మమతా
కాగా ఈనెల ముప్నైన రాష్ట్ర్రపతి భవన్లో తిరుగులేని మెజారీటిని సాధించింది బీజేపీ. దీంతో నరేంద్రమోడీ రెండోసారీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గత 50 సంవత్సారాల రాజకీయ విజయాన్ని తిరగరాయడంతో పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేపట్టన్నారు.ఇందుకోసం ప్రపంచదేశాల నాయకులు ,దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు హజరవనున్నారు. విదేశాల నాయకులతోపాటు స్వదేశంలోని వివిధపార్టీల నేతలు,ముఖ్యమంత్రులకు కూడ అహ్వానం అందుతోంది.దీంతో ఇద్దరు నాయకుల మధ్య రాజకీయ వైరం ఉన్నా మమత హజరయ్యోందుకు సిద్దమయ్యారు.
టీఎంసీ ఎమ్మెల్యేలు ,నాయకులు బీజేపీలో చేరినా చలించని మమతా
ముఖ్యంగా మంగళవారం కూడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆపార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. దేశంలో భారి అధిక్యం కనబరిచిన బీజేపీ పంచన తృణముల్ ఎమ్మెల్యేలు, పార్టీ కౌన్సిలర్లు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు, కమ్యునిస్టు పార్టీ ఎమ్మెల్యే తోపాటు 50 మంది కౌన్సిలర్లు బీజేపీ నాయకుడు విజయవర్గీయ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు
ఎన్నికల్లో హోరాహోరి పోరాటం చేసిన మమతా బెనర్జీ
కాగా ఎన్నికల నేపథ్యంలో సుమారు 40 మంది తృణముల్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారని ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రెండు పార్టీల మధ్య ఎన్నికల్లో తీవ్రపోరు జరిగింది. పశ్చిమ బెంగాల్లో ప్రధాని నరేంద్రమోడీ అడుగు పెట్టకుండా మమతా బెనర్జీ తీవ్ర ప్రయత్నాలు చెపట్టారు. చివరి దఫా ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ చీఫ్ అమిత్ షా చేపట్టిన ర్యాలీలో ఉద్రిక్తత నెలకొంది.
అయితే మమత బెనర్జీ మాత్రం దీన్ని స్పోర్టీవ్గా తీసుకుంది. రాజ్యంగబద్దంగా చేపట్టనున్న పదవి కావడంతోపాటు అదికూడ రాష్ట్ర్రపతి భవన్లో జరుగుతుండడంతో ఆమే వెళ్లేందుకు సిద్దమయ్యారు.దీని కోసం ఆమే ప్రతిపక్ష పార్టీలను సైతం తీసుకెళ్లేందుకు సన్నద్దమవుతున్నారు.