మోడీపై దీదీ గుస్సా.. దేశం పేరు కూడా మారుస్తారని ధ్వజం
పశ్చిమ బెంగాల్ ఎన్నికల క్యాంపెయిన్ హీటెక్కిస్తోంది. ప్రధాని మోడీ లక్ష్యంగా టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ఒక్కో పేరును మోడీ మార్చుకుంటు వస్తున్నారని ఫైరయ్యారు. తర్వాత దేశం పేరు కూడా ఛేంజ్ చేస్తారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
కరోనా వైరస్ వ్యాక్సిన్ సర్టిఫికెట్, కాలేజీ, స్టేడియాలుకు మోడీ పేరు ఎందుకు అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తుంటే త్వరలో దేశం పేరు మార్చే అవకాశం ఉందన్నారు. పెట్రో ధరల మండిపాటును కూడా ప్రశ్నించారు. ప్రభుత్వం ఉచితంగా రేషన్ ఇస్తూ.. సిలిండర్కు రూ.900 వసూల్ చేస్తున్నారని తెలియజేశారు. ప్రజలకు ఏదైనా ఇవ్వాలని అనుకుంటే మోడీ ఉచితంగా ఎల్పీజీ సిలిండర్ ఇవ్వాలని కోరుకున్నారు.
మహిళ దినోత్సవం సందర్భంగా మమతా బెనర్జీ పాదయాత్ర నిర్వహంచారు. ఈ సందర్భంగా మోడీపై ఫైరయ్యారు. అంతకుముందు బెంగాల్లో మహిళలకు రక్షణ లేదని మోడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే మమతా వెంటనే కౌంటర్ ఇచ్చారు.