దీదీ చెంపదెబ్బలే నాకు శ్రీరామరక్ష : మోదీ
Recommended Video
దీదీ వర్సెస్ మోదీల మధ్య పోలిటికల్ వార్ కొనసాగుతోంది. మరో రెండు దశలు ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఇద్దరి నేతల మధ్య పోలిటికల్ పంచ్ లు పేలుతున్నాయి. నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై మోడీ స్పందించారు. ఈ నేపథ్యంలోనే దీదీ చెంపదెబ్బలే నాకు అశీర్వాదాలు అంటూ బెంగాల్లోని పురులియాలో ర్యాలీలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.
బెంగాల్లోని పురులియా ర్యాలీలో ప్రధాని మోదీ
బెంగాల్ ర్యాలీలో పాల్గోన్న ప్రధాని నరేంద్రమోడీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మరోసారి ఫైర్ అయ్యారు. ఇప్పటికే ఇద్దరి మధ్య వార్ కొనసాగుతున్న నేపథ్యంలోనే మమత బెనర్జీని తాను దీదీ అని సంబోదిస్తాని దీదీ నన్ను కొట్టే చెప్పదెబ్బలే నాకు ఆశీర్వాదాలు అవుతాయని ఆయన అన్నారు.
పాకిస్థాన్ ప్రధానినే దీదీ అంగీకరిస్తుందా...
కాగా మమతా బెనర్జీ నన్ను ప్రధానిగా అంగీకరించనని బహిరంగాగానే చెప్పిందని ఆమేకు రాజ్యగం పట్ల గౌరవం లేదని అన్నారు. రాజ్యంగం ద్వార దేశ అత్యున్నత స్థానాన్ని కూడ దీదీ గౌరవించడం లేదని అన్నారు.ఈనేపధ్యంలోనే పాకిస్థాన్ ప్రధానమంత్రినే దేశ ప్రధానిగా గుర్తిస్తుందని మోడీ మండిపడ్డారు.
శారదా చిట్ఫండ్ వివాదాన్ని తెరపైకి తెచ్చిన మోదీ
ఈనేపథ్యంలోనే ప్రధాని శారదా చిట్ఫండ్స్ అయితే మమతా వ్యాఖ్యలను నేను అంగీకరిస్తాను కాని మమతా బెనర్జీకి దమ్ముంటే అవే చెంపదెబ్బలను బీద ప్రజల సోమ్మును చిట్ఫండ్ రూపంలో కాజేసిన వారిని కొట్టగలదా అని ఆయన ప్రశ్నించారు. కాగా ఇద్దరి మధ్య ఫోని తుఫాన్ నేపథ్యంలోనే చెలరేగిన రాజకీయ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఏదో ఒక చోట దీదీతో పాటు మోడీలు విమర్శలు చేసుకుంటున్నారు.