వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీన్ రివర్స్: ఇప్పుడు స్మగ్లర్లు గోసంరక్షకులను కాలుస్తున్నారు..అక్కడ జరిగింది అదే..!

|
Google Oneindia TeluguNews

హర్యానా: ఇప్పటి వరకు గోవులను తరలిస్తున్న వారిని గోసంరక్షకులు దాడి చేసి చంపేసిన ఘటనలను చూశాం. అయితే హర్యానాలో ఇందుకు భిన్నంగా జరిగింది. గోవులను స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ గోసంరక్షకుడిపై దాడి చేసి చంపారు. హర్యానా రాష్ట్రం పల్వాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని గోపాల్‌గా గుర్తించడం జరిగింది. ఈయన గోరక్షక్ సమితిలో సభ్యుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. గోవులను దొంగలించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న గోపాల్ ఆ గోవులను తరలిస్తున్న వాహనంను తన మోటార్ సైకిల్‌లో వెంబడించాడు.

జూలై 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వాహనంను చేజ్ చేస్తుండగా గోపాల్‌ను స్మగ్లింగ్ గ్యాంగ్‌ సభ్యులు తుపాకీతో కాల్చి హత్యచేశారు. వెంబడిస్తూనే ఫోన్ తీసి ఇతరులకు సమాచారం చేరవేస్తుండగా స్మగ్లర్లు గోపాల్‌ను కాల్చినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంకు చేరుకున్న పోలీసులు గోపాల్ మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు. ఇదిలా ఉంటే గోవులను స్మగ్లింగ్ చేసే మాఫియానే గోపాల్‌ను హత్యచేశారని కన్నీరు మున్నీరయ్యారు మృతుడి కుటుంబ సభ్యులు.

Man a member of Gau Rakshak Samiti shot dead by cow smugglers

ప్రాథమిక సమాచారం ప్రకారం గోపాల్ స్థానిక గోరక్షక సమితిలో చాలా క్రియాశీలకంగా ఉంటాడని తెలుస్తోంది. అయితే గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనంను వెంటపడుతుండగా అతన్ని స్మగ్లర్లు కాల్చేశారని గోపాల్ స్నేహితులు చెప్పారు. అయితే గోపాల్ హత్యతో ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన మరో ఘటనలో జూలై 31న గోవులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పట్టుకుని స్థానికులు చితకబాదినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు మొత్తం స్మగ్లర్‌ను చుట్టేయడంతో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో స్మగ్లర్‌తో పాటు మరో ఇద్దరి గ్రామస్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

English summary
A 35-year-old man was shot dead by alleged cow smugglers in Haryana's Palwal. The victim identified as Gopal was a member of ‘Gau Rakshak Samiti’ and was allegedly attacked and killed while chasing a vehicle allegedly loaded with stolen cows.The case came to light on July 28. The victim tried to chase the vehicle and was shot dead by cow smugglers the moment he took out his phone to inform other members of the Samiti. His body was sent for postmortem and the investigation is ongoing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X