భార్య బలంగా ఉంది, ఆస్తీ ఇంకా బలంగా ఉంది, బ్యాంకులో డబ్బులు, సుపారి కిల్లర్స్ తో ఫినిష్ ! పక్కింటిలో!
బెంగళూరు: భార్య పేరు మీద ఉన్న ఆస్తీ, బంగారు నగలు, ఆమె అకౌంట్ లోని డబ్బులు, కాజేయాలనే ఆలోచనతో సుపారి కిల్లర్స్ తో కలిసి ఆమెను కట్టుకున్న భర్త హత్య చేయించాడు. గతంలో దంపతులు ఒకరి మీద ఒకరు కేసులో పెట్టుకోవడం, భార్య అనుమానాస్పద స్థితిలో మరణించడంతో భర్త అసలు స్వరూపం బయటపడింది. భార్య మీద అనుమానంతో దూరం అయిన భర్త చివరికి ఆమె ఆస్తీ కోసం కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేయించాడని బెంగళూరు నగరంలోని వయ్యాలికావెల్ పోలీసులు తెలిపారు.
కూతురి ఫ్రెండ్ తో వ్యాపారి అక్రమ సంబంధం, సెక్స్ వీడియోలతో బ్లాక్ మెయిల్, సింపుల్ గా చంపేసింది!
భార్య మీద అనుమానం
బెంగళూరు నగరంలోని వయ్యాలికావెల్ లో నివాసం ఉంటున్న నరేంద్ర బాబు, వినూతకు 12 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. నరేంద్ర బాబు, వినూత దంపతులకు ఓ పాప ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం నరేంద్ర బాబు భార్య వినూత మీద అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో భార్య వినూతతో నరేంద్ర బాబు గొడవ పడేవాడని తెలిసింది.
విడిపోయిన దంపతులు
నరేంద్ర బాబు, వినూత దంపతుల మధ్య నిత్యం గొడవలు ఎక్కువ అయ్యాయి. దంపతుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతొ పరస్పరం ఇద్దరూ కేసులు పెట్టుకున్నారు. తరువాత నరేంద్ర బాబు, వినూత దంపతులు విడిపోయి వయ్యాలికావెల్ లో వేరువేరుగా కాపురం ఉంటున్నారు.
భార్య ఆస్తీ, డబ్బులు, నగలు
భార్య పేరు మీద ఉన్న ఆస్తీ, ఆమె బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులు, నగలు కాజేయాలని నరేంద్ర బాబు ప్లాన్ వేశాడు. భార్య వినూత చచ్చిపోతే తనకు ఆస్తీ, డబ్బులు, బంగారు నగలు తన చేతికి వస్తాయని నరేంద్ర బాబు భావించాడు. తన భార్య వినూతను హత్య చేయించాలని స్నేహితులతో నరేంద్ర బాబు చర్చించాడు.
ఇంట్లో కిరాయి కిల్లర్స్
బెంగళూరు గ్రామీణ జిల్లా హోస్ కోటే ప్రాంతానికి చెందిన ప్రశాంత్, కుందాపురకు చెందిన జగన్నాథ్ అనే ఇద్దరితో తన భార్య వినూతను పక్కాప్లాన్ తో హత్య చేస్తే మీకు రూ. 5 లక్షలు ఇస్తానని నరేంద్ర బాబు ఒప్పందం చేసుకున్నాడు. డిసెంబర్ 20వ తేదీన ఉదయం వినూత వయ్యాలికావెల్ లోని ఇంటికి బయట తాళం వేసి వేరే ప్రాంతానికి వెళ్లింది. వినూత బయటకు వెళ్లిన తరువాత జగన్నాథ్, ప్రశాంత్ వయ్యాలికావెల్ లోని ఆమె ఇంటి కిటికీ ఊచలు కత్తిరించి ఇంట్లోకి వెళ్లారు.
పక్కాప్లాన్ తో చంపేశారు
పని ముగించుకున్న వినూత మద్యాహ్నం బయట ఇంటి తాళం తీసి లోపలికి వెళ్లింది. ఆ సమయంలో బెడ్ రూంలో తలదాచుకున్న ప్రశాంత్, జగన్నాథ్ కర్రలు, రాడ్ లో తీసుని వినూత మీద దాడి చేశారు. తలకు తీవ్రగాయాలైన వినూత అక్కడే మరణించింది.
ఏం జరిగింది?
మరుసటి రోజు వినూత బంధువులు ఆమె హత్యకు గురైన విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వినూత ఇంటి చట్టుపక్కల వారిని విచారణ చేశారు. వినూత, ఆమె భర్త నరేంద్ర బాబుల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నరేంద్ర బాబును అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా కిరాయి హంతకులతో తానే వినూతను హత్య చేయించానని అంగీకరించాడని పోలీసులు అన్నారు. నరేంద్ర బాబుతో పాటు కిరాయి హంతకులు జగన్నాథ్, ప్రశాంత్ లను అరెస్టు చేశామని, ఈ కేసులో ఇంకా కొంత ప్రమేయం ఉందని అనుమానం ఉందని వయ్యాలికావెల్ పోలీసులు తెలిపారు.