lockdown:వైద్య సిబ్బందిపై కత్తితో దాడి, టీచర్ చెంప చెల్.. మొబైల్ తీసుకొని...
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నెలకొనగా.. విధులు నిర్వర్తిస్తున్న వైద్య సిబ్బందిపై దాడిచేశాడు. ఆ బృందంలో ఉన్న టీచర్పై కూడా చేయిచేసుకున్నాడు.మధ్యప్రదేశ్ వినోబ నగర్లో జరిగిన ఘటన కలకలం రేపింది. సదరు వ్యక్తి ఎందుకు దాడిచేశాడో తెలియరాలేదు. సర్వే వివరాలు చెప్పడం ఇష్టం లేకనా..? మరేదైనా కారణం ఉందా అనే విషయం పోలీసుల విచారణలో వెలుగులోకి రానున్నది.
మధ్యప్రదేశ్ వినోబ నగర్లో శనివారం సర్వే బృందం పర్యటించింది. ఇందులో వైద్యులు, టీచర్లు, పారమెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్లు కూడా ఉన్నారు. వారు సర్వే చేస్తుండగా ఒకతను విరుచుకుపడ్డాడు. వైద్య సిబ్బందిపై అతను కత్తితో దాడిచేశాడు. దీంతో మిగతా సభ్యులు ఉలిక్కిపడ్డారు. బృందంలో ఉన్న టీచర్పై కూడా చేయిచేసుకున్నాడు. ఆమె ఫోన్ తీసుకొని.. నెలకేసి పడేశాడు. వైద్య సిబ్బందిపై దాడి చేయబోతే అడ్డుకోవడమే టీచర్ చేసిన పాపమైపోయింది. అడ్డొచ్చిన స్థానికులపై కూడా దాడి చేశారు.
దాడితో వినోబ నగర్లో కలకలం రేగింది. వైద్య సిబ్బందిపై దాడిని సర్వే ఇంచార్జీ ప్రవీణ్ చౌరే ధృవీకరించారు. కత్తితో విరుచుకుపడ్డ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం, తదితర సెక్లన్ల కింద కేసు నమోదు చేశారు.
Recommended Video