వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉల్లిపాయల గొడవ: కస్టమర్‌పై రెస్టారెంట్ సిబ్బంది దాడి

|
Google Oneindia TeluguNews

onions
ముంబై: మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ముంబైలోని పైధోనిలోని ఓ రెస్టారెంటుకు వచ్చిన వినియోగదారుడు ఆహారాన్ని ఆర్డర్ చేసిన తర్వాత ఒక ప్లేటు ఉల్లిపాయలు అడిగినందుకు అతన్ని రెస్టారెంట్ సిబ్బంది చితకబాదారు.

వివరాల్లోకి వెళితే.. మయూర్ ప్రీతి జాదవ్ అనే కస్టమర్ రెస్టారెంటుకు వచ్చి ఆహారాన్ని ఆర్డర్ చేశాడు. ఆహారాన్ని వడ్డించిన తర్వాత ఆహారంలో ఉల్లిగడ్డలు లేకపోవడంతో వెయిటర్‌ను ఒక ప్లేటు ఉల్లి గడ్డలు తేవాలని కోరాడు. అందుకు వెయిటర్ నిరాకరించాడు. దీంతో మయూర్ ప్రీతి జాదవ్.. వెయిటర్‌తో వాగ్వాదానికి దిగాడు. జాదవ్ వాగ్వాదంతో ఆగ్రహానికి గురైన ఇద్దరు వెయిటర్లు అతనిపై దాడికి దిగి చితకబాదారు.

దాడిలో జాదవ్ తలకు, ముక్కుకు, నుదుటిపై గాయాలయ్యాయి. దీంతో జాదవ్ స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. దాడికి పాల్పడిన వెయిటర్లు మహ్మద్ రిజ్వాన్ జియావుద్దీ అహ్మద్, బ్రిజ్బన్ ఆశారాం సింగ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు ఆ ఇద్దరు వెయిటర్లను కోర్టులో ప్రవేశపెట్టగా మంగళవారం వరకు కోర్టు వారికి పోలీస్ కస్టడీని విధించింది. వెయిటర్లపై ఐపిసి 326, 323, 504, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
A 23-year-old man was bashed up by the waiters in a restaurant after he demanded a plate of onions with the food. The incident happened at an eatery in Pydhonie early on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X