ఉల్లిపాయల గొడవ: కస్టమర్పై రెస్టారెంట్ సిబ్బంది దాడి
వివరాల్లోకి వెళితే.. మయూర్ ప్రీతి జాదవ్ అనే కస్టమర్ రెస్టారెంటుకు వచ్చి ఆహారాన్ని ఆర్డర్ చేశాడు. ఆహారాన్ని వడ్డించిన తర్వాత ఆహారంలో ఉల్లిగడ్డలు లేకపోవడంతో వెయిటర్ను ఒక ప్లేటు ఉల్లి గడ్డలు తేవాలని కోరాడు. అందుకు వెయిటర్ నిరాకరించాడు. దీంతో మయూర్ ప్రీతి జాదవ్.. వెయిటర్తో వాగ్వాదానికి దిగాడు. జాదవ్ వాగ్వాదంతో ఆగ్రహానికి గురైన ఇద్దరు వెయిటర్లు అతనిపై దాడికి దిగి చితకబాదారు.
దాడిలో జాదవ్ తలకు, ముక్కుకు, నుదుటిపై గాయాలయ్యాయి. దీంతో జాదవ్ స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. దాడికి పాల్పడిన వెయిటర్లు మహ్మద్ రిజ్వాన్ జియావుద్దీ అహ్మద్, బ్రిజ్బన్ ఆశారాం సింగ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు ఆ ఇద్దరు వెయిటర్లను కోర్టులో ప్రవేశపెట్టగా మంగళవారం వరకు కోర్టు వారికి పోలీస్ కస్టడీని విధించింది. వెయిటర్లపై ఐపిసి 326, 323, 504, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.