యువతితో రోమాన్స్: నగ్నంగా బయటకు లాక్కొచ్చిన అమ్మాయి ఫ్యామిలీ, ఏం చేశారంటే!
ప్రియురాలితో కలిసి రాసలీలు జరుపుతున్న సమయంలో ఓ యువకుడికి ఊహించని పరిణామం ఎదురైయ్యింది. కళ్ల ముందు ప్రియురాలి కుటుంబ సభ్యులు అందరూ దర్శనం ఇవ్వడంతో ఆ యువకుడు హడలిపోయాడు.
జైపూర్: ప్రియురాలితో కలిసి రాసలీలు జరుపుతున్న సమయంలో ఓ యువకుడికి ఊహించని పరిణామం ఎదురైయ్యింది. కళ్ల ముందు ప్రియురాలి కుటుంబ సభ్యులు అందరూ దర్శనం ఇవ్వడంతో ఆ యువకుడు హడలిపోయాడు.
కుమార్తెను కుర్చీలో కట్టేసి పక్కింటి ఆంటీని రేప్ చేశాడు, చివరికి కామాంధుడు !
వారి నుంచి తప్పించుకోని పారిపోవడానికి విఫలయత్నం చేశాడు. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు అతన్ని బయటకు లాక్కొచ్చి దేహశుద్ది చేశారు. తీవ్రగాయాలైన యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.
ఎడారిలో చిగురించిన ప్రేమ
రాజస్థాన్ లోని చురు జిల్లాలోని తారా నగర్ లో రాజ్ కుమార్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను 22 ఏళ్ల యువతిని ప్రేమించాడు. ఆమె రాజ్ కుమార్ ను ప్రేమించడంతో తరచూ ఇద్దరూ రహస్యంగా కలుసుకుంటున్నారు.
అమ్మయిని లొంగదీసుకున్నాడు !
తన ప్రియురాలితో చనువుగా ఉంటున్న రాజ్ కుమార్ చివరికి ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అప్పుడప్పుడు కలిసే వీరిద్దరూ ఈ మద్య కాలంలో ఎక్కువ దగ్గర అయ్యారు.
ఇంటిలోనే మాకం పెట్టాడు !
నెల క్రితం వరకూ ప్రియురాలిని బయట కలుసుకునే రాజ్ కుమార్ తరువాత తన ప్లాన్ మార్చాడు. తన కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో ప్రియురాలికి సమాచారం ఇస్తున్నాడు. తరువాత తన ఇంటికి ప్రియురాలిని పిలుపించుకుని రోమాన్స్ చేస్తున్నాడు.
అమ్మాయి ఫ్యామిలీకి !
రాజ్ కుమార్ ను కలుసుకోవడానికి అతని ప్రియురాలు ఒంటరిగా వెలుతోంది. రోజు ఆమె ఇంటి నుంచి బయటకు వెలుతున్న విషయాన్ని మొదట కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి కొన్ని గంటల తరువాత తిరిగి రావడంతో వారికి అనుమానం వచ్చింది.
అమ్మాయిపై నిఘా వేస్తే
యువతి స్నేహితుల ఇంటికి వెలుతుందా ? అంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆరా తీశారు. అయితే ఆ యువతి నేరుగా ప్రియుడి ఇంటికి వెళ్లి కొన్ని గంటల తరువాత బయటకు వస్తోందని గమనించారు. మరుసటి రోజు అమ్మాయి వెళ్లిన గంట తరువాత రాజ్ కుమార్ ఇంటిలోకి యువతి కుటుంబ సభ్యులు ప్రవేశించారు.
ప్రియురాలితో రోమాన్స్ !
నగ్నంగా ప్రియురాలితో రోమాన్స్ చేస్తున్న రాజ్ కుమార్ ను ఆమె కుటుంబ సభ్యులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అలాగే బయటకు లాక్కెళ్లి చితకబాదేశారు. రాజ్ కుమార్ ను చితకబాదుతున్న సమయంలో మొబైల్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ !
తీవ్రగాయాలైన రాజ్ కుమార్ ఓప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాజ్ కుమార్ ను చితకబాదుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం గుర్తించిన అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయి కుటుంబ సభ్యులు సురేంద్ర, పవన్, జగదీష్, ప్రసాద్ ,రాజబాల తదితర 10 మంది మీద కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నామని చురు జిల్లా ఎస్పీ రాహుల్ భరత్ తెలిపారు.