ఇప్పుడు ఎలా పట్టుకుంటారు... హెల్మట్ చుట్టు ఆర్సీ,డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలు అంటించిన వ్యక్తి...
కొత్త ట్రాఫిక్ నిబంధనలతో ప్రజలు అందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే.. కేంద్రం నూతన చట్టాన్ని తీసుకువచ్చిందే తడవుగా వెంటనే ఆ చట్టాన్ని మెజారీటి రాష్ట్రాలు హుటాహుటిన అమలు చేస్తున్నాయి. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని వేగంగా అమలు చేస్తున్నారు. ఉదయం లేస్తూనే పలు ట్రాఫిక్ కూడళ్లలో వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఇలా ప్రతీ రోజు ఏదో ఒక చోట తనీఖీలు నిర్వహించడం పోలీసులకు విధిగా మారింది. ఈ నేపథ్యంలోనే తనిఖీల్లో సరైన పత్రాలు లేకుండా పట్టుబడిన వారిపై వేలాది రూపాయల జరిమానాలు విధిస్తున్నారు.
విమానంలో దంపతులు.. భార్య పడుకుంది... పక్కనే భర్త 6 గంటలపాటు....
అయితే వాహనంతో రొడ్డుపైకి వచ్చిన తర్వాత ఆయా నగరాల్లో పోలీసులు ఖచ్చితంగా తనిఖీలు చేస్తున్నారు. ఇలా రోడ్డుపైకి వస్తున్నవారు అప్పుడప్పుడు తమ వాహానానికి సంబంధించిన పేపర్లను మరిచిపోతే ఇంతే సంగతులు.వెంటనే వేల రుపాయలు జేబులకు చిల్లులు పడాల్సిందే. ఇందుకోసమే గుజరాత్కు చెందిన రాంపాల్ అనే ఓ టూ వీలర్ యజమాని విన్నూత్నంగా వ్వవహరించాడు.
టూ వీలర్కు సంబంధించిన పేపర్స్ అన్ని తన హెల్మట్ చూట్టు అతికించుకున్నాడు. డ్రైవింగ్ లైసెన్స్తో పాటు ఆర్సీ, పోల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ పేపర్లను హెల్మట్ చుట్టు అతికించాడు. దీంతో ఆ వీడీయో సోషల్ మీడీయాలో వైరల్ అవుతోంది. పోలీసుల తీరుకు వాహానాల యజమానులు పడుతున్న ఇబ్బందులను ఇలా తెలుపుతునారు. ఈ సంధర్భంలోనే ఇటివల జరిమాన విధించిన ఓ బైకర్ తన బైక్ను మంటలకు అహూతి చేసిన విషయం తెలిసిందే...