షాకింగ్ : రైలుపైకి ఎక్కి.. హై టెన్షన్ విద్యుత్ తీగలు తాకి.. యువకుడి ఆత్మహత్య
కర్ణాటక : బెంగళూరు మేజిస్టిక్ రైల్వే స్టేషన్ లో విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న రైలుపైకి ఎక్కి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడు పెద్దగా అరుస్తూ పరుగులు తీయడంతో.. అక్కడున్న ప్రయాణీకులు ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ పడ్డారు. చివరకు అతడు రైలుపైకి ఎక్కి హై టెన్షన్ విద్యుత్ తీగలు తాకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఇంటర్ ఉచ్చు : ప్రభుత్వంపై నజర్.. టార్గెట్ జగదీశ్ రెడ్డి.. బర్తరఫ్ కోసం విపక్షాల పట్టు
ఆత్మహత్య చేసుకున్న యువకుడిని కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మతిస్థిమితం సరిగా లేని కారణంగా ఇలా సూసైడ్ చేసుకున్నాడేమో అనే కోణంలో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువకుడు రైలుపైకి ఎక్కి విద్యుత్ తీగలు తాకే క్రమంలో చాలామంది వద్దని వారించారు. అయినా కూడా అతడు హై టెన్షన్ వైర్లు తాకడంతో మంటలు చెలరేగి క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. అందరూ చూస్తుండగానే విగతజీవిగా మారాడు.