ప్రేమకు నో.. ఫోన్ నంబర్ కూడా ఇవ్వలే.. అందుకే నీటిలో పురుగులమందు కలిపాడట..
ఉన్నావ్ మైనర్ బాలికల మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఇద్దరు చనిపోగా.. మూడో వ్యక్తి పరిస్థితి క్రిటికల్గా ఉంది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరికీ పురుగుల మందుతో కూడిన మంచినీరు అందజేసినట్టు పేర్కొన్నారు. వారిలో ఒక అబ్బాయి ప్రపోజ్ చేయగా తిరస్కరించడంతో దారుణానికి ఒడిగట్టారు. అశోహ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బాబురా గ్రామంలో ఘటన జరిగింది.
ఘటనా వివరాలను ఐజీ లక్ష్మీ సింగ్ వెల్లడించారు. అందులో వినయ్ అలియాస్ లంబు ఒకమ్మాయిని ప్రేమించాడు. కానీ ఆమె అతనిని ఇష్టపడలేదు. సరికాద ఫోన్ నంబర్ ఇవ్వాలని అడిగినా ఇవ్వలేదు. దీంతో అతను ఆగ్రహానికి గురయ్యాడు. మంచినీటి బాటిల్లో వినయ్ పురుగుల మందు కలిపాడు. అయితే ఆ నీటిని ముగ్గురు తాగారు. ఘటనా స్థలంలో సిగరేట్ ప్యాకెట్ కూడా లభించింది.
మృతుల కుటుంబాలను ఆదుకుంటాయని యూపీ సర్కార్ తెలిపింది. ఒక్కో ఫ్యామిలీ రూ.5 లక్షలు అందజేస్తామని వెల్లడించింది. మరొకరికి రూ.2 లక్షలు ఇస్తామని ప్రకటించారు.