కస్గంజ్ హింస: చనిపోయాడనుకున్న వ్యక్తి మాట్లాడాడు
లక్నో: యూపీలోని కస్గంజ్ ప్రాంతంలో ఇటీవల తిరంగా బైక్ ర్యాలీ సందర్భంగా హింసాత్మకం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి 31 మందిని అరెస్టు చేశారు. అయితే, హత్య కింద ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పారు.
పాకిస్తాన్ అభిమానులు చంపేశారు: బీజేపీ ఎంపీ తీవ్ర ఆగ్రహం
మరోవైపు, రాహుల్ అనే మరో వ్యక్తి కూడా ఈ ఘటన సందర్భంగా మృతి చెందినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరిగింది. అయితే తాను బతికి ఉన్నానని అతను చెప్పాడు.
రాహుల్ మృతి చెందినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని పోలీసులు వెల్లడించారు. అంతేకాదు, ఈ వార్త మీడియాలోను వచ్చిందని చెప్పారు. ఇతను నోయిడాకు చెందిన మీడియా గ్రాడ్యుయేట్.
అతను చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. అంతేకాదు, అతని నెంబర్కు ఫోన్లు కూడా చేసి అడిగారు. తన పేరును ఉపయోగించుకొని కొందరు అలజడి సృష్టించాలని భావించారేమోనని రాహుల్ అన్నారు.
సోషల్ మీడియాలో అతను చనిపోయినట్లు ప్రచారం జరిగిందని, కానీ రాహుల్ జీవించే ఉన్నాడని పోలీసులు చెప్పారు. కానీ కొందరు ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని సృష్టించారని అన్నారు.