రైల్వేస్టేషన్లో అందరూ చూస్తుండగానే బలవంతంగా అమ్మాయిని ముద్దు పెట్టాడు(వీడియో)
Recommended Video
ముంబై: మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు, పోలీసులు రక్షణ చర్యలు చేపడుతున్నప్పటికీ.. వారిపై వేధింపులు మాత్రం ఆగడం లేదు. చాటు మాటునే కాకుండా బహిరంగ ప్రదేశాల్లోనూ మహిళలపై వేధింపులు జరగడం శోచనీయం.
తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ యువతికి అందరు చూస్తుండగానే వేధింపులు ఎదురయ్యాయి. నవీ ముంబైలోని టర్బే రైల్వే స్టేషన్లో గురువారం ఉదయం ఫోట్లో మాట్లాడుతూ వెళ్తున్న ఓ యువతి వెనకాలే వెళ్లిన ఓ వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.
#WATCH: Girl molested at Turbhe railway station in Navi Mumbai yesterday; accused has been arrested after complaint #Maharashtra pic.twitter.com/kwUfFhCZZG
— ANI (@ANI) February 23, 2018
అంతేగాక, బలవంతంగా ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఇదంతా అక్కడున్నవారు చూస్తున్నారే గానీ, ఆమెకు మద్దతుగా ఎవరూ నిలవకపోవడం విచారకరం. కాగా, ఈ దృశ్యాలన్నీ స్టేషన్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
కాగా, ఆ వ్యక్తి తనను స్టేషన్ బయటి నుంచే వెంబడించాడని యువతి చెబుతోంది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు.. గంటల వ్యవధిలోనే సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని పేరు నరేష్ జోషి(43)గా గుర్తించారు.