కోడలిపై మామ లైంగిక వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?
చెన్నై: కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో మామకు నాలుగేళ్ళ జైలు శిక్షను విధిస్తూ తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు మహిళ కోర్టు బుధవారం నాడు తీర్పు చెప్పింది అంతేకాదు రూ.12 వేల జరిమానాను కూడ విధించింది.
తమిళనాడు రాష్ట్రంలోని అంబూరు ప్రాంతానికి చెందిన పి.సెల్వం కొడుకు శివ 2009లో ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకొన్నాడు. అయితే పన్నీర్ సెల్వానికి మద్యం తాగే అలవాటు ఉంది.
అయితే ప్రతి రోజూ మద్యం తాగి వచ్చి కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు ఆయనకు బాధితురాలు ఎంతగానో నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. కానీ అతడు వినలేదు. దీంతో బాధితురాలు నిందితుడిపై అంబూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఈ కేసు నమోదు చేసుకొన్న పోలీసులు విచారణ చేశారు. కోర్టులో ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సమర్పించారు. వేలూరు మహిళా కోర్టు బుధవారం నాడు తీర్పు చెప్పింది.
కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడు పి. సెల్వానికి నాలుగేళ్ళ జైలు శిక్షను విధించారు. మహిళల వేధింపు చట్టం కింద మరో ఏడాది జైలు శిక్షను ఏక కాలంలో అనుభవించాలని కోర్టు తీర్పు చెప్పింది.దీనికి తోడు మరో రూ.12 వేల జరిమానాను విధిస్తున్నట్టు జడ్జి తీర్పును వెలువరించారు.