కడుపున పుట్టిన బిడ్డపైనే తండ్రి రేప్: యావజ్జీవ శిక్ష..
కడుపున పుట్టిన బిడ్డపైనే అత్యాచారానికి పాల్పడ్డ ఓ తండ్రికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.
ముంబై: పదేళ్ల వయసున్న సొంత కూతురిపైనే అత్యాచారానికి ఒడిగట్టిన ఓ తండ్రికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు పోస్కో చట్టం కింద 34ఏళ్ల ఆ తండ్రికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
రెండేళ్ల క్రితం, జూన్15,2014న ఈ అత్యాచార ఘటన చోటు చేసుకుంది. నిందితుడి భార్య తన సోదరుడిని హాస్టల్ లో దిగబెట్టడానికి గుజరాత్ వెళ్లగా.. ఆమె ఇద్దరు కూతుళ్లు, భర్త మాత్రమే ఆరోజు ఇంట్లో ఉన్నారు. ఇదే అదునుగా భావించిన తండ్రి పదేళ్ల వయసున్న కూతురి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత అగస్టు4,2014న కుమారుడు ఈ విషయాన్ని తల్లికి చెప్పడంతో విషయం వెలుగుచూసింది. విషయం తెలియగానే బంధువులను, సన్నిహితులను ఇంటికి పిలిపించి భర్తకు దేహశుద్ది చేయించింది. దీంతో ఇంటినుంచి పారిపోయిన నిందితుడు రెండురోజుల వరకు ఇంటికి రాలేదు.
భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. కేసు తుది విచారణ సందర్బంగా కోర్టు అతనికి యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది. తండ్రిగా బిడ్డకు రక్షణగా ఉండాల్సిందిపోయి.. కన్నబిడ్డపైనే అత్యాచారానికి ఒడిగట్టడం సిగ్గుచేటు అని కోర్టు పేర్కొంది.