80ఏళ్ల వృద్ధురాలిని రేప్ చేసిన యువకుడు.. యావజ్జీవ శిక్ష..
వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన 28ఏళ్ల యువకుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ నాగపట్టణం మహిళా న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
చెన్నై: 80ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన 28ఏళ్ల యువకుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ నాగపట్టణం మహిళా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గత ఫిబ్రవరి 6న ఈ అత్యాచార ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చంద్రశేఖరన్(28) గత ఫిబ్రవరి 6న వృద్ధురాలిపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాడిలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడటంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆమె కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. చంద్రశేఖర్ను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం నాగపట్టణం జిల్లా ఫాస్ట్ట్రాక్ కోర్టు జడ్జి సెల్వసుందరి బెంచి సమక్షంలో ఈ కేసు విచారణ జరిగింది. ఇదే క్రమంలో మంగళవారం నాడు కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడికి రూ.వెయ్యి జరిమానాతో పాటు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే ప్రభుత్వం తరుపున బాధితురాలికి రూ.2లక్షల పరిహారం ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించింది.