యువతి స్నానం చేస్తుంటే మూడు స్మార్ట్ మొబైల్ ఫోన్లలో వీడియోలు, వైరల్, ఫ్యామిలీ, సినిమా షూటింగ్!
చెన్నై/ రామనాథపురం: యువతి స్నానం చేస్తున్న సమయంలో స్మార్ట్ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీసి వాటిని స్నేహితులకు షేర్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసిన యువకుడికి పోలీసులు బెండ్ తీశారు. యువతులు, మహిళలు స్నానం చేస్తున్న సమయంలో వీడియోలు తియ్యడమే పనిగా పెట్టుకున్న యువకుడు, అతని స్నేహితులు అసలు బండారం బట్టబయలు అయ్యింది. విషయం వెలుగు చూడటంతో పోలీసులకు బయపడి సముద్ర తీరప్రాంతంలో తలదాచుకున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
పెళ్లి కాని ఆంటీ, ఎర్రగా బుర్రగా బలంగా ఉందని, దుబాయ్ లో కంపెనీలు, ఎండీకి పంగనామాలు, ఎస్కేప్!
యువతి పక్కింటిలో కామాంధుడు
తమిళనాడులోని రామనాథపురం జిల్లా కీళ్ కరై సమీపంలోని కన్నిరాజపురంలో ఓ యువతి నివాసం ఉంటోంది. యువతి నివాసం ఉంటున్న ఇంటి పక్కనే ఎబేసన్ (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఎబేసన్ కామాంధుడు అని సమాచారం. యువతితో పాటు చుట్టుపక్కల నివాసం ఉంటున్న మహిళల మీద ఎబేసన్ కన్ను వేశాడు.
బాత్ రూంలో యువతి!
ఇటీవల యువతి స్నానం చెయ్యడానికి వెళ్లింది. ఆ సమయంలో యువతి పక్కంటిలో నివాసం ఉంటున్న ఎబేసన్ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న అతని స్నేహితులు ఎబిరోన్, విఘ్నేష్ లకు సమాచారం ఇచ్చాడు. ఎబేసన్, ఎబిరోన్, విఘ్నేష్ యువతి నివాసం ఉంటున్న ఇంటి దగ్గరకు వెళ్లారు.
మూడు స్మార్ట్ మొబైల్ ఫోన్లలో వీడియోలు
యువతి స్నానం చేస్తున్న సమయంలో ఎబేసన్, ఎబిరోన్, విఘ్నేష్ మూడు స్మార్ట్ మొబైల్ ఫోన్లు తీసుకుని మూడు పక్కల నుంచి సినిమా షూటింగ్ సీన్లు తీసినట్లు వీడిమోలు తీశారు. తరువాత ముగ్గురి మొబైల్ ఫోన్లలో యువతి స్నానం చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు షేర్ చేసుకున్నారు.
సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
యువతి స్నానం చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను నిందితులు ముగ్గురు వారి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశారు. తరువాత అదే వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి. యువతి బంధువు ఒకరు ఆ వీడియో చూసి షాక్ కు గురైనాడు. వెంటనే యువతి కుటుంబ సభ్యులకు అతను సమాచారం ఇచ్చాడు.
కన్యాకుమరికి పరార్
నేను స్నానం చేస్తున్న సమయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని యువతి కీళ్ కరై మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదైయ్యింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎబేసన్, ఎబిరోన్, విఘ్నేష్ ల కోసం గాలించారు. పోలీసులు మాకోసం గాలిస్తున్నారని తెలుసుకున్న ముగ్గురు పరారైనారు. కన్యాకుమరి జిల్లాలోని తేంగాయ్ పట్టినం తీర ప్రాంతంలో ఎబేసన్ తల దాచుకున్నాడని పోలీసులకు సమాచారం అందడంతో అతన్ని అరెస్టు చేశారు. పరారైన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని కీళ్ కరై పోలీసులు తెలిపారు.