ఆసుపత్రిలో తండ్రి: ఇంటిలో తల్లి, చెల్లిని దారుణంగా కత్తితో చంపేశాడు, చివరికి!
చెన్నై: తండ్రికి సరైన వైద్యం చేయించలేమని జీవితంపై విరక్తి పెంచుకున్న యువకుడు దారుణంగా ప్రవర్తించాడు. తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే ఇంటిలో విచక్షణ కొల్పోయిన యువకుడు తల్లి, చెల్లిని దారుణంగా హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడు.
తమిళనాడులోని కడలూరు జిల్లా దిండివనంలోని సమ్మై అమ్మళ్ దేవాలయం వీధిలో రాజారాం (45) అనే ఆయన భార్య సుమతి (40), కుమారుడు రంజిత్ (25), కుమార్తె విధ్యాప్రియ (24) నివాసం ఉంటున్నారు.
రాజారాం కడలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో కంప్యూటర్ సెక్షన్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. లివర్, కిడ్నీ చెడిపోవడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రాజారాం చికిత్స పొందుతున్నారు. వైద్యం కోసం రాజారాం కుటుంబ సభ్యులు ఇప్పటికే చాల అప్పులు చేశారు.
రాజారాంకు లివర్, కిడ్నాలు మార్చాలంటే దాదాపు రూ. 60 లక్షలు ఖర్చు అవుతోందని ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది. అంత డబ్బు సమకూర్చలేని రాజారాం కుటుంబ సభ్యలు విలవిలలాడిపోయారు.
తండ్రికి వైద్యం చేయించలేదని మనం ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే అని ఆయన కుమారుడు రంజిత్ నిర్ణయించాడు. శుక్రవారం రాత్రి తల్లి సుమతి, చెల్లి విధ్యాప్రియ నిద్రపోతున్న సమయంలో రంజిత్ కత్తి తీసుకుని ఇద్దరినీ దారుణంగా పోడచి చంపేశాడు.
అనంతరం వైరుతో రంజిత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఎంత సేపు అయినా కుటుంబ సభ్యులు ఎవ్వరూ బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు పోలీసీులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూడగా ఈ విషయం వెలుగు చూసింది.