భార్య ఉండగానే మరో మహిళతో ఎఫైర్: 11 ముక్కలుగా నరికివేత, అరెస్ట్
సూరత్: కట్టుకొన్న భార్యను ముక్కలు ముక్కలుగా నరికి ఉద్నాలోని కాలువలో పడేస్తుండగా నిందితుడిని పోలీసులు రెడ్ హ్యండెడ్గా పట్టుకొన్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకొంది. నిందితుడిపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో తొమ్మిదేళ్ళ బాలికపై అత్యాచారం చోటు చేసుకొంది. ఆ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన మర్చిపోకముందే మరో విషాదకరమైన ఘటన గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
రెండో భార్యను నరికిన భర్త
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పట్టణంలో షానవాజ్ అలియాస్ షానూ యూసుఫ్మియా షేక్ పార్సీ షేరీలోని రాణి తలావ్లో సరుకు రవాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అక్కడే తన భార్యతో జోహ్రబ్ నబీతో నివాసం ఉంటున్నాడు అమ్రావతికి చెందిన జులేఖతో ప్రేమాయణం సాగించాడు.దీంతో ఆమెను రెండో పెళ్ళి చేసుకొన్నాడు. దీంతో ఇద్దరి భార్యలతో ప్రతి రోజూ ఇంట్లో గొడవలు చోటు చేసుకొన్నాయి. ఈ కారణంగానే ఆయన రెండో భార్యను చంపేశాడు. ముక్కలు ముక్కలుగా నరికాడు.
ఇద్దరు భార్యలతో కాపురం
మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో భార్యను వివాహం చేసుకొన్నాడు షానవాజ్. దీంతో ఇద్దరు భార్యలు ఒకే ఇంట్లో ఉంచారు. మొదటి భార్య జోహ్రాబ్ నబీకి, జులేఖకు మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ గొడవలతో షానవాజ్ భరించలేకపోయాడు. ప్రశాంతత లేకుండా పోయిందని భావించాడు రెండో భార్య జులేఖను అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ చేసి చంపేశాడు.
మృతదేహం కాలువలో
ఇద్దరు భార్యల గొడవతో రెండో భార్యను చంపాలని భావించిన షానవాజ్ ఆదివారం నాడు రాత్రి ఆమెను చంపేసి శరీరాన్ని 11 ముక్కలుగా చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా భతేనాఖడీలోని ఉద్నా కాలువలో పడేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయం ఉందా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పరారీలో మొదటి భార్య
షానవాజ్ రెండో భార్య మృతదేహన్ని కాలువలో పారేస్తుండగా అతను పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే షానవాజ్ మొదటి భార్య, ఆమె సోదరి పారిపోయారు. అయితే ఈ హత్యలో వీరిద్దరి ప్రమేయం కూడ ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరూ కూడ ఢిల్లీకి పారిపోయారని పోలీసులు అభిప్రాయంతో ఉన్నారు. వారి కోసం కూడ గాలింపు చర్యలు చేపట్టారు.