వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలు వచ్చేముందు పట్టాలపై పడుకున్నాడు: ప్రయాణికులు కాపాడారిలా(వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

రైలు వచ్చేముందు పట్టాలపై పడుకున్నాడు: ప్రయాణికులు కాపాడారిలా(వీడియో)

ముంబై: కుటుంబ సమస్యల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాలపై పడుకున్నాడు. గమనించిన వెంటనే స్పందించిన ప్రయాణికులు అతడ్ని కాపాడారు. ఈ ఘటన ముంబైలోని కుర్లా రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది.

కుర్లా రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. పట్టాలపై పడుకున్న వ్యక్తిని 54ఏళ్ల నరేంద్ర దమాజీ కోటేకర్‌గా గుర్తించారు. రైల్వే స్టేషన్‌లో చాలా మంది ఉన్నప్పటికీ కొందరు మాత్రం వెంటనే స్పందించి ఆయన ప్రాణాలు కాపాడారు.

 Man Lay On Rail Track In Mumbai. Dramatic Rescue Recorded On CCTV

కుటుంబ సమస్యల కారణంగా నరేంద్ర ఆత్మహత్యకు ప్రయత్నించాడని, అతన్ని గమనించిన తోటి ప్రయాణికులు రక్షించారని.. కుర్లా స్టేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ వెల్లడించారు. ఆపై అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు.

కాగా, కొద్ది రోజుల క్రితం పాన్వేల్ రైల్వే స్టేషన్‌లో ఇలానే ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఓ యువకుడిని రైల్వే పోలీసు ఒకరు రక్షించారు. అంతకుముందు ఫిబ్రవరి 5వ తేదీన నయీగావ్ రైల్వే స్టేషన్‌లో కూడా ఓ ఐదేళ్ల బాలుడిని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాపాడాడు.

English summary
Around 1.30 pm on Monday at Mumbai's Kurla Railway station, a man quietly went to the tracks and lay down, sparking a commotion. Several people on the platform spotted him, some screamed, and a few jumped on to the tracks to drag him to safety.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X