వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పశువులను దొంగిలించే యత్నం: గంటలపాటు కొట్టడంతో వ్యక్తి మృతి

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ పశువులను దొంగతనం చేస్తున్నాడంటూ 32 ఏళ్ల ఓ వ్యక్తిని గ్రామస్తులు కొట్టి చంపారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడికి పాల్పడిన నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పాట్నా సమీపంలోని పుల్వారిషరీఫ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓ గేదెను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ముహమ్మద్ అలీంగిర్‌ను పట్టుకుని చితకబాదారు. అతని వెంట వచ్చిన మరో వ్యక్తి పారిపోయాడు.

 Man Lynched Near Patna Over Cattle Theft Suspicion, Was Beaten For Hours

స్థానికులు విచక్షణారహితంగా కొన్ని గంటలపాటు కొట్టడంతో ముహమ్మద అలీంగిర్ తీవ్రగాయాలపాలయ్యారు. బుధవారం సాయంత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.

2017లో వరుస ఘటనలు జరిగిన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. మనుషులను చంపడం అనేది ఆమోద యోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే, పలు చోట్ల తమ పశువులను దొంగిలించే ప్రయత్నం చేస్తుండటం స్థానికులు తీవ్ర ఆగ్రహానికి లోనైవారిపై దాడులు చేస్తున్నారు.

English summary
A 32-year-old man in Bihar was beaten to death by a mob over suspicion of cattle theft near state capital Patna on Wednesday. All the accused were arrested immediately, the police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X