వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలు కదులుతుండగా ఎక్కబోయి.. పట్టాలపై జారిపడి.. ప్రాణాలతో బయటపడి (వీడియో)

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్‌ : అద‌ృష్టం ఎప్పుడు ఎలా కలిసివస్తుందో చెప్పలేం. ఒకోసారి మృత్యు ఒడికి చేరి ప్రాణాలు దక్కించుకున్న అదృష్టవంతులు కూడా ఉంటారు. అదే కోవలో ఓ ప్రయాణికుడు రైలు ఎక్కబోతూ పట్టాలపై జారిపడ్డా కూడా ప్రాణాలతో బయటపడ్డ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది.

మంచిర్యాలలో కిలాడీ.. ఉద్యోగాల పేరిట బురిడీ.. కోటి రూపాయలకు పైగా మోసంమంచిర్యాలలో కిలాడీ.. ఉద్యోగాల పేరిట బురిడీ.. కోటి రూపాయలకు పైగా మోసం

ఒడిషాలోని ఝర్సుగూడ రైల్వే స్టేషన్‌లో మంగళవారం అనుకోని ఘటన జరిగింది. రాజేశ్ తల్వార్ అనే యువకుడు హవ్‌రా నుంచి సాంబల్‌పూర్‌కు రైలులో ప్రయాణిస్తున్నాడు. అయితే ఝర్సుగూడ రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఆగినప్పుడు ఛాయ్ కోసమని కిందకు దిగాడు. ఆ క్రమంలో టీ తాగి వచ్చేంతలోపు రైలు కదిలింది.

 Man Miraculously Survives After Falling Between Moving Train And Platform

దాంతో ఆ రైలును క్యాచ్ చేసే క్రమంలో రాజేశ్ జారిపడి పట్టాలపై పడ్డాడు. వెంటనే అలర్టైన రైల్వే పోలీసులు ట్రైన్‌ను నిలిపివేశారు. పట్టాలపై పడ్డ రాజేశ్‌ను నెమ్మదిగా బయటకు తీసుకొచ్చారు. అయితే స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ప్రాణపాయం తప్పడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
English summary
A man survived miraculously after he fell on the track while trying to board a moving train at the Jharsuguda railway station here on Tuesday. The passenger, identified as Rajesh Talwar, was reportedly travelling from Hawra to Sambalpur when the incident occurred.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X