వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
షాక్: 3 గదుల ఇంటికి రూ.38 వేల కోట్ల విద్యుత్ బిల్లు
మూడు గదులు, మూడు ఫ్యాన్లు, ఓ టివి ఉన్న ఓ వ్యక్తికి 38వేల కోట్ల రూపాయాల కరెంట్ బిల్లు వచ్చింది. జంషెడ్పూర్కు చెందిన భీఆర్ గుహకు జార్ఖండ్ విద్యుత్ బోర్డు అధికారులు షాకిచ్చారు.
జంషెడ్పూర్: మూడు గదులు, మూడు ఫ్యాన్లు, ఓ టివి ఉన్న ఓ వ్యక్తికి 38వేల కోట్ల రూపాయాల కరెంట్ బిల్లు వచ్చింది. జంషెడ్పూర్కు చెందిన భీఆర్ గుహకు జార్ఖండ్ విద్యుత్ బోర్డు అధికారులు షాకిచ్చారు. అంతేకాదు ఈ బిల్లును చెల్లించడం లేదంటూ ఆయన ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
జంషెడ్పూర్కు చెందిన బీఆర్ గుహకు చిన్న ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ ఇంట్లో సాధారణ విద్యుత్ ఉపకరణాలను మాత్రమే వినియోగిస్తున్నాడు. ప్రతి నెల కూడ ఆయనకు సాధారణంగా మాత్రమే విద్యుత్ చార్జీలను చెల్లిస్తున్నాడు. కానీ, ఆదివారం నాడు ఆయన విద్యుత్ బోర్డు నుండి ఊహించని షాక్ ఎదురైంది.
38వేల కోట్ల బిల్లును చెల్లించడం లేదంటూ ఆ ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ విషయమై జార్ఖండ్ విద్యుత్ బోర్డుకు ఫిర్యాదు చేయడంతో పరిశీలిస్తామని హమీ ఇచ్చినట్టుగా చెప్పారని బాధిత కుటుంబం ప్రకటించింది.
Comments
English summary
A man in Jamshedpur was in for a shock when he received an electricity bill of Rs 38 billion on Sunday.B R Guha was handed the non-payment of the bill by the Jharkhand Electricity Board, following which, electricity was disconnected from his home.
Story first published: Monday, August 14, 2017, 13:17 [IST]