బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ను బాంబ్ పెట్టి చంపేస్తా, బెదిరించిన వ్యక్తి అరెస్ట్..
ఉన్నావ్ బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిజ్నూర్ జిల్లాకు చెందిన గఫార్.. మహారాజ్కు ఫోన్ చేసి బాంబుతో దాడి చేసి చంపేస్తానని బెదిరించాడు. దీంతో పోలీసులకు ఎంపీ ఫిర్యాదు చేయడంతో యూపీ పోలీస్ యాంటీ టెర్రరీ స్క్వాడ్ పోలీసులు గఫార్ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
సాక్షి మహారాజ్ బెదిరింపులకు సంబంధించి అడగగా.. నిందితుడు గఫార్ అంగీకరించాడు. తాను కువైట్లో ఉన్న సమయంలో సాక్షి మహారాజ్కు ఫోన్ చేసి బెదిరించానని ఒప్పుకున్నాడు. గఫార్పై 504, 507, 66 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గఫార్ను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి.. రిమాండ్ కోసం ఇవ్వాలని కోరతామని చెప్పారు.
Recommended Video
గఫార్ నుంచి ఫోన్, పాస్పోర్ట్, ఆధార్ కార్డు, ఐడీ కార్డు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే గఫార్ ఎందుకు సాక్షి మహారాజ్ను బెదిరించాడనే అంశంపై పోలీసులు వివరించలేదు. విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంది.