కట్నం తీసుకురాలేదని భార్య పై యాసిడ్ దాడి
మీరట్: కట్నం తీసుకురాలేదని భార్యామీద భర్త యాసిడ్ దాడి చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో జరిగింది. తీవ్రగాయాలైన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృత్యువుతో పోరాడుతున్నదని పోలీసులు తెలిపారు.
రెండు సంవత్సరాల క్రితం సాజిద్, ఉజ్మా (26)ల వివాహం జరిగింది. పెళ్లి అయినప్పటి నుండి సాజిద్ వరకట్నం తీసుకురావాలని ఉజ్మాను వేధించడం మొదలు పెట్టాడు. ఇటివల కాలంలో వేధింపులు మరి ఎక్కువయ్యాయి. ఉజ్మా తట్టుకోలేకపోయింది.
రూ. 50,000 తీసుకురావాలని క్రూరంగా వేధించాడు. వేధింపులు తట్టుకోలేక ఉజ్మా పుట్టింటికి వెళ్లి పోయింది. అయినా నిత్యం ఫోన్ లు చేసి వరకట్నం తీసుకురావాలని సాజిద్ వేధించాడు. ఉజ్మా పట్టించుకొలేదు. శుక్రవారం రాత్రి ఉజ్మా పుట్టింటిలో నిద్రపోతున్నది.
ఆ సమయంలో సాజిద్ తన సోదరులు మజిద్, రిజ్వాన్ తో కలిసి ఉజ్మా ఇంటి దగ్గరకు వెళ్లారు. తరువాత గొడవ పెట్టుకుని ఉజ్మామీద యాసిడ్ పోసి అక్కడి నుండి పరారైనారు. ఉజ్మా దాదాపు 40 నుండి 50 శాతం కాలిపోయిందని పోలీసులు అన్నారు. ఉజ్మా తండ్రి నాసీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.