వీడు మనిషేనా : లైంగిక దాడికి ప్రయత్నించి.. ప్రశ్నించిన కుటుంబ సభ్యులను కారుతో ఢీ కొట్టాడు..
యూపీలో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. యువతిని వేధించి నరకం చూపించాడు.అయితే లైగింగ వేధింపులపై యువతి ప్రశ్నించడంతో ఆ కామంధుడు యువతితో పాటు వారి కుటుంభ సభ్యులను కారుతో గుద్ది చంపాడు.. అనంతరం దాన్ని ప్రమాదంగా చీత్రికరించే ప్రయత్నం చేశాడు..అయితే పోలీసులు కూడ మహిళ మృతిని కారు ప్రమాదంగానే కేసును నమోదు చేసుకున్నారు. ప్రమాదం నుండి తేరుకున్న తర్వాత ప్రమాదానికి గురైన మహిళలు పోలీసులకు పిర్యాధు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఉత్తర ప్రదేశ్ లోని బులంద్ షహార్ జిల్లాకు చెందిన ఓ ఉన్నత కులానికి చెందిన వ్యక్తి తన గ్రామంలో ఓ దళిత మహిళ యువతిపై కన్నేశాడు..ఆమేను లైంగికంగా లొంగదీసుకునేందుకు పలు ప్రయత్నాలు చేశాడు. అయితే ఆ దళిత మహిళ కామంధుడి మాట వినకపోవడంతో దళిత మహిళ కుటుంభంపై కక్ష పెంచుకున్నాడు. ఈనేపథ్యంలోనే సోమవారం రాత్రీ యువతితోపాటు మరో కుటుంభ సభ్యురాలు కలసి రోడ్డు వెళుతుండడంతో పసిగట్టిన కామంధుడు వాళ్లతో అసభ్యంగా ప్రవర్తించాడు. కాసేపటికే వాళ్లను కారుతో గుద్ది చంపేందుకు ప్రయత్నాలు చేశాడు. అనుకున్నట్టుగా రోడ్డుపై నడుస్తున్న వారిపై హై స్పిడ్తో తన కారులో వచ్చి గుద్ది వెళ్లిపోయాడు.
కాగా ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. దీంతో ప్రమాదానికి గురైన వారి వద్దకు పలువురు స్థానికులు చేరుకోవడంతో నిందితుడు పరారయ్యాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రమాదంగా కేసును నమోదు చేసుకున్నారు. ఇక మహిళలు ప్రమాదం నుండి తేరుకున్న తర్వాత లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ,మాట వినకపోవడంతో కారు ప్రమాదానికి గురి చేశాడని పిర్యాధు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును నమోదు చేశారు.