పనిచేస్తున్న సంస్థకే కన్నం.. 58 కిలోల బంగారం మాయం
ఔరంగాబాద్ : ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. అదే కోవలో ఓ నగల షాపు మేనేజర్ చాలా రోజులుగా సంస్థకు కన్నం వేస్తున్నా గుర్తించలేకపోయారు యజమానులు. చివరకు వాడి వాలకం చూసి అనుమానం వచ్చి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కిలోలకొద్దీ బంగారం మాయం చేశాడు ఆ చోరాగ్రేసరుడు.
ఏనుగుకు స్వాతంత్ర్యం వచ్చిన వేళ.. గజ"రాజు" వేడుకలు (వీడియో)
మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో వెలుగుచూసిన ఘటన నగల షాపుల నిర్వాహకులను విస్మయానికి గురిచేస్తోంది. పనోళ్లతో జాగ్రత్తగా ఉండాలనే ఇండికేషన్ ఇస్తోంది. సమర్థ్ నగర్ లో ఉన్న వమన్ హరి పెథే జ్యువెల్లరీ షాపులో జరిగిన చోరీ దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. స్టోర్ మేనేజర్ మరో ఇద్దరు ఉద్యోగులతో కలిసి చేసిన దొంగతనం బయటపడింది.
పనిచేసే సంస్థకే కన్నం పెట్టారు ప్రబుద్ధులు. స్టోర్ మేనేజర్ గా పనిచేసిన అంకుర్ రాణే, తన కింద పనిచేస్తున్న సహోద్యోగులతో కలిసి ఏకంగా 58 కిలోల బంగారం మాయం చేశాడు. లోకేష్ జైన్, రాజేంద్ర జైన్ అనే ఇద్దరు ఉద్యోగులతో ఈ చోరీకి స్కెచ్ వేశాడు. యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మేనేజర్ ను అరెస్ట్ చేశారు. అతడు చెప్పిన వివరాల మేరకు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.