షాకింగ్ : ఎంపీ సుమలత అంబరీష్కు కరోనా పాజిటివ్...
కర్ణాటకలోని మండ్య ఎంపీ,నటి సుమలత అంబరీష్కు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో ఆమె సెల్ఫ్ క్వారెంటైన్లోకి వెళ్లారు. సోమవారం(జూలై 6) ట్విట్టర్ ద్వారా సుమలత స్వయంగా ఈ విషయాలను వెల్లడించారు.
ఇటీవల తనకు తలనొప్పి,గొంతు మంటగా అనిపించడంతో.. ముందు జాగ్రత్తలో భాగంగా టెస్టులు చేయించుకున్నట్లు తెలిపారు. సోమవారం వచ్చిన రిపోర్టుల్లో పాజిటివ్గా తేలిందన్నారు. ఇటీవల తన నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నట్లు తెలిపారు.
భగవంతుడి దయ వల్ల తనలో రోగ నిరోధక శక్తి మెండుగా ఉందని,ఆత్మవిశ్వాసంతో ఉన్నానని సుమలత చెప్పారు. ప్రజలందరి ఆశీస్సులతో త్వరలోనే కోలుకుంటానని విశ్వాసం వ్యక్తం చేశారు. తనతో కాంటాక్ట్ అయిన వ్యక్తుల వివరాలను ప్రభుత్వ అధికారులకు అందజేస్తానని తెలిపారు. ఎవరైనా తనతో కాంటాక్ట్లోకి వచ్చి.. కరోనా లక్షణాలు గనుక కనిపిస్తే ఆలస్యం చేయకుండా టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య 23,474గా ఉండగా... ఇప్పటివరకూ 372 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటివరకూ 9849 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అవగా... ప్రస్తుతం 13,249 యాక్టివ్ కేసులున్నాయి.
The results have arrived today. It is positive with very mild symptoms and I have been advised home treatment.
— Sumalatha Ambareesh 🇮🇳 ಸುಮಲತಾ ಅಂಬರೀಶ್ (@sumalathaA) July 6, 2020
Hence, I have quarantined myself and going through the prescribed treatment as per my doctor’s instructions. (2/n)